మార్చి 8 ఆదివారం అంతర్జాతీ మహిళా దినోత్సవం సందర్భంగా గుంటూరులో దిశ పోలీస్ స్టేషన్ ను ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహిళల గురించి మాట్లాడారు. మహిళల భద్రతకు ఏపీ రాష్ట్ర పోలీస్ శాఖ పెద్ద పీట వేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 13 దిశ పోలీస్ స్టేషన్లను ప్రారంభించామని తెలిపారు. పోలీస్ స్టేషన్లను ప్రారంభించాం కానీ.. దిశ చట్టం మాత్రం ఇంకా రాష్ట్రంలో అమల్లోకి రాలేదన్నారు. 

 

 

దిశ చట్టం అమలు గురించి ఎదురు చూస్తున్నామన్నారు డీజీపీ గౌతమ్ సవాంగ్. దిశ పోలీస్ స్టేషన్లలో 50 శాతం మహిళా ఉద్యోగుల్నే నియమిస్తామనని తెలిపారు. తెలంగాణలో దిశ హత్యాచార ఘటన, దోషుల ఎన్ కౌంటర్‌ తో ఏపీలో సీఎం జగన్ సర్కార్ మహిళల రక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.. అందుకు గాను మహిళల రక్షణ కోసం రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

 

 

ఏపీలో మొట్టమొదటి దిశ పోలీస్ స్టేషన్‌ ను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతపాటు ఆపదలో ఉన్న మహిళలు ఫిర్యాదును చేసేలా దిశ యాప్‌ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ యాప్ ద్వారా ఇప్పటికే అనేక ఫిర్యాదులు స్వీకరించి ఆపదలో ఉన్న ఆడవారికి సకాలంలో సాయం చేసి వారికి రక్షణ కల్పించారు. అయితే దిశ చట్టం మాత్రం ఇంకా అమల్లోకి రాలేదని అన్నారు.

 

ఇటీవల దిశ చట్టాన్ని ఆమోదించకుండా పలు సవరణలు చేసి తిరిగి పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి తిప్పి పంపిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు సవరణలు చేసి చట్టాన్ని త్వరలోనే అమలు చేస్తామని గతంతో ఏపీ హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. కాగా., రాష్ట్రంలో  అత్యాచార కేసుల్లో 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా ఈ చట్టం ద్వారా a శిక్ష ను తీసుకువచ్చింది. సోషల్ మీడియా, ఫోన్లలో మహిళల గురించి అసభ్యంగా ప్రవర్తిస్తే .. రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధిస్తారు. మహిళలు, చిన్నారులపై తీవ్రమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష విధిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: