సొంత అన్న కూతురు సంచైత పై అశోక్ గజపతి రాజు చేస్తున్న వ్యాఖ్యలు నిపుణుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనం గా మారుతున్నాయి. తన కడుపున పుట్టకపోయినా సొంత సహోదరుడు కూతురు పై పైగా పూసపాటి వంశానికి చెందిన వారసురాలు పైనే అశోక్ గజపతి రాజు దారుణమైన వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు అనుభవించిన అశోక్ గజపతి రాజు సింహాచలం దేవస్థానం చైర్ పర్సన్ పదవి విషయంలో వ్యవహరిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. కూతురు లాంటి సంచైత పై అశోక్ గజపతి రాజు మతాన్ని అడ్డంపెట్టుకొని కాంట్రవర్షియల్ కామెంట్ చేశారు. ఆమె క్రైస్తవ మతానికి చెందిన అమ్మాయి అంటూ ఆరోపించారు.

 

అంతేకాకుండా మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో వైసీపీ సర్కార్ వేలు పెట్టడమేంటని కూడా గద్దించారు. దీంతో తన బాబాయ్ చాలా దారుణంగా దిగజారి మరి మాట్లాడటంతో సంచయిత కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చింది. నేను వాటికన్ సిటీకి వెళ్లి అక్కడ ఫోటో దిగితే క్రైస్తవ మతానికి చెందిన దాన్ని అని సర్టిఫికేట్ ఇచ్చేస్తారా అంటూ నిలదీసింది. నేను పుట్టుకతోనే హిందువునని అది మా బాబాయ్ కి కూడా తెలుసు అంటూ కౌంటర్లు వేసింది. మరి మా బాబాయ్ తన జీవితంలో చర్చిలు, మసీదులకు వెళ్ళలేదా, ఆయన కూడా మతం పుచ్చుకున్నారా అని గట్టిగానే ప్రశ్నించారు. తాను పక్కా హిందువుని అని ఆమె చెప్పుకున్నారు.

 

తన పనితీరు చూసి బాబాయ్ విమర్శిస్తే బాగుండేది, కానీ తనకు అర్హత లేదని అనడం బాధాకరమని ఆమె ఆవేదన చెందారు. తన తాత పీవీజీ రాజు మహిళలను ప్రోత్సహించి వారికి మహిళా కళాశాల కట్టిస్తే బాబాయ్ మహిళలకు పదవులు అక్కరలేదని మాట్లాడుతున్నారని, మహిళా దినోత్సవం వేళ మంచి బహుమతే ఇచ్చారని కళ్ళనీళ్ళ పర్యంతం అయ్యారు. ఇదే సందర్భంలో అదే వంశానికి చెందిన మనవరాలిగా పాత కు సంబంధించిన ఆస్తి విషయంలో వేల ఎకరాలు తన వైపు వచ్చే ప్లాన్ తన లాయర్ తో సంచైత చేసి రాజుగారికి మరొక షాక్ సిద్ధం చేయటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: