రెండు తెలుగు రాష్ట్రాలలో బండ్ల గణేష్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. కమెడియన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బండ్ల గణేష్ ఒరిస్సా ఆఫర్లు దక్కించుకుని నిర్మాతగా మారడం జరిగింది. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను నిర్మించి ఇండస్ట్రీలో అద్భుతమైన విషయాలు అందుకున్నాడు. దీంతో వేస్తున్న ప్రతి అడుగూ సక్సెస్ లో పడటంతో ...బండ్ల గణేష్ చూపు రాజకీయాల వైపు పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో 2018వ సంవత్సరంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఆ సమయంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే 'సెవన్ ఓ క్లాక్' బ్లేడుతో మీడియా ముందే పీక కోసుకుంటా అని బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా హైలెట్.

 

దీంతో బండ్ల గణేష్ పేరు కాస్త బ్లేడుగణేష్ గా సోషల్ మీడియాలో మారిపోయింది. అయితే ఈ విషయాలను పక్కన పెడితే తాజాగా వేదికలపై కోటలు దాటే మాటలు చెప్పే బండ్ల గణేష్ ఇండస్ట్రీలో ఓ బడా చాన్స్ కొట్టేయాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఓ సారి ఆ సంగతేంటో చూద్దాం. బండ్ల గణేష్ రాజకీయాలకు గుడ్ బై చెప్పి.. పూర్తిగా సినీ పరిశ్రమకే తన జీవితాన్ని అంకితం చేస్తానని సరిలేరు నీకెవ్వరు ప్రమోషన్స్‌లో చెప్పుకొచ్చాడు. ఈ మేరకు  భారీ డైలాగ్‌లనే కొట్టాడు.

 

ఈ సినిమాతో మళ్లీ కెరీర్ ఊపందుకుంటుందని ఆశపడ్డాడు. తీరా చూస్తే బండ్ల గణేష్ పాత్ర అందులో తేలి పోయింది. ఇలాంటి క్యారెక్టర్ ఎందుకు చేశావంటూ ఇంట్లో పిల్లలు కూడా బండ్లను ప్రశ్నించారట. అయితే బండ్ల గణేష్ ప్రస్తుతం ఓ భారీ స్కెచ్ వేసే పనిలోనే ఉన్నాడని టాక్. అయితే తాజాగా గతంలో పవన్ కళ్యాణ్ జపం చేసినట్లు మళ్ళీ పరిస్థితి బాగోక పోవడం తో సోషల్ మీడియాలో పవన్ జపం చేయడం తో ' బండ్లన్నా ఆపు నీ అతి...ఇంకెప్పుడూ ఇటువంటి ట్రిక్స్ ప్లే చేయొద్దు అంటూ పవన్ ఫ్యాన్స్ సీరియస్ రిప్లై ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: