ఈ మధ్య కాలంలో దొంగ బాబాలు ఎక్కువైపోతున్నారు. దేవుడిపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని క్యాష్ చేసుకుని వ్యాపారాన్ని మూడు పువ్వులు... ఆరు కాయలుగా సాగిస్తున్నారు. ఇలా ఎంతో మంది ప్రజలను మోసం చేస్తున్నారూ. కేవలం ప్రజలను మోసం చేయటం మాత్రమే కాదు.. ఇంకెన్నో అరాచకాలకు కూడా పాల్పడుతున్నారూ. దీంతో ఎంతో  మంది దొంగ బాబాల బారిన పడి బలవుతున్నారు.  దొంగ బాబాల ముసుగులో ఎంతో మంది ఆడపిల్లలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారూ. అయితే ఇలా అత్యాచారాలకు పాల్పడుతున్నా... బయటకి చెప్తే ఎక్కడ పరువు పోతుందేమో అనే భయంతో... బయటకి చెప్పుకోవటం లేదు. కొంత మంది మాత్రం తమపై జరిగిన అత్యాచారం ఘటనను బయట పెట్టి.. దొంగ బాబాల గుట్టు రట్టు చేస్తున్నారు. 

 


ఇక్కడ ఇలాంటిదే జరిగింది. పాద పూజ చేయటానికి ఓ యువతికి మాయ మాటలు చెప్పి తీసుకొనిపోయిన కర్ణాటక స్వామీజీ గుట్టు రట్టయ్యింది. యువతిని పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్న బాబా ను పట్టుకుని కటకటాల వెనక్కి తోసారు పోలీసులు. యువతిని వివాహం చేసుకున్న దత్తత్రేయా అవదూత స్వామీజీ.. సల్మాన్ ఖాన్ లాగా కండలు చూపిస్తూ టిక్ టాక్ లో హల్ చల్ చేసాడు. అయితే తాజాగా ఆ స్వామీజీ పెళ్లి చేసుకున్న యువతి ఆ స్వామీజీకి రివర్స్ కావటంతో పోలీసులు ఆ స్వామీజీ అరెస్ట్ చేసి 420 కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి తోసారు. మంగులూరు లోని గోకర్ణ లో ఓ గెస్ట్ హౌస్ లో ఈ స్వామిజీని అదుపులోకి తీసుకున్నారు. 

 

అయితే గతంలో ఎప్పుడు స్వామీజీ  లాగా కాషాయం ధరించి.. గుబురు గడ్డంతో ఉండేవాడు. కానీ ఆ యువతిని పెళ్లి చేసుకున్నాక మాత్రమే గెటప్ మొత్తం మార్చేసి  మాడ్రన్ గా తయారై పోయాడు ఆ స్వామిజీ. ఇక ఆ యువతితో టిక్టాక్ చేయడంతో యువతి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే పోలీసులు దొంగ స్వామీజీ ని పట్టుకున్న సమయంలో ఆ యువతి పూర్తిగా స్వామీజీకి రివర్సయిపోయింది.  పాద పూజ కోసం వెళ్లిన తనను ఎదిరించిన స్వామీజీ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడంటూ యువతి ఆరోపించడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. అంతేకాదు తమను నమ్మించి ఎన్నో డబ్బులు కూడా వసూలు చేశాడు అంటూ మరికొందరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏకంగా ఆ స్వామి తొమ్మిది కేసులు నమోదు చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: