అందం అనేది కళ్లతో చూసేది కాదు మనసుతో చూసేది.. మనిషి ఎంత అందంగా ఉన్నా మనసుకు మాత్రం చెదలు పట్టించుకుని ఉంటే ఆ అందంకు విలువేముంది.. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్న జంట విషయంలో ఇది అక్షరాల నిజం అని అనుకోక తప్పదు.. వీరిద్దరు తేనే పూసిన కత్తులట. ఎలాగంటారా.. కశ్మీర్ నుంచి వచ్చిన ఈ జంట ఢిల్లీలో ఆత్మాహుతి దాడులకు కుట్ర పన్నుతోందని, ఉగ్రదాడులకు ముస్లిం యువకులను పురి గొల్పుతుందని సౌత్ ఢిల్లీ పోలీసులు గుర్తించారట..  

 

 

ఇందులో ఉన్న ఆ అందమైన యువతి భర్త జహాన్జీబ్ ఓ ప్రయివేట్ కంపెనీలో పనిచేసేవాడని.. వీరిద్దరూ ఇండియన్ ముస్లిమ్స్ యునైట్ పేరిట ఓ సోషల్ మీడియా వేదికను నిర్వహించారని సమాచారం. ఈ వేదిక ద్వారా సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా వీరు జనాలను ఆకర్షించారని తెలుస్తోంది. ఇకపోతే జామియా యూనివర్సిటీ ఉన్న ప్రాంతంలోనే వీరికి అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఇంతటి నేర చరిత్ర, ఉగ్రవాద సపోర్ట్ కలిగిన ఈ జంటను నిఘా వర్గాల సమాచారం మేరకు ఢిల్లీ స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం ఉదయం అరెస్ట్ చేశారట.

 

 

ఇక నైరుతి ఢిల్లీలోని ఒఖాలా ప్రాంతంలో నివసిస్తున్న ఈ జంట, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను ప్రేరేపిస్తున్నారట, ఇదే కాకుండా అమాయకమైన యువతను రెచ్చకొట్టి ఉగ్రవాదం వైపు మళ్లేలా ఆకర్షిస్తున్నారని సమాచారం. వీరికి అప్ఘానిస్థాన్‌లో ఖొరాసాన్ ప్రావిన్స్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాదులతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలిందట.. వీరికి సంబంధించిన మరిన్ని వివరాలను రాబట్టే పనిలో పోలీసులు తమ దర్యాప్తును ముమ్మురం చేశారట..

 

 

ఇకపోతే గత నెలలో ఈశాన్య ఢిల్లీలో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 53 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.. ఇంతటి విధ్వంసం జరగడంలో వీరి ప్రమేయం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా పోలీసులు ఆలోచిస్తున్నారట.. చూసారా అందం చాటు దాగున్న అపాయం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: