ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనం రేపుతున్న మారుతి రావు మరణం లో కొత్త ట్విస్టులు బయటికి వచ్చాయి. 2018లో తన సొంత కూతురు అమృత... ప్రణయ్ అనే ఒక దళిత యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని మారుతీ రావు ఒక కాంట్రాక్ట్ కిల్లర్ తో గర్భిణిగా ఉన్న తన కూతురు ముందే అతనిని అతికిరాతకంగా హత్య చేయించిన విషయం తెలిసిందే. అయితే అనూహ్యరీతిలో మారుతీరావు నిన్న ఆర్య వైశ్య భవన్ లో శవంలా కనపడేసరికి ఒక్కసారిగా అంతా షాక్ తిన్నారు. అయితే ఘటనా స్థలం వద్ద సూసైడ్ నోట్ దొరికినా కూడా పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తుండగా కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి.

 

IHG

 

ముందుగా మొదటి విషయం ఏమిటంటే మారుతీరావు చనిపోయి ఉన్న గదిలో ఆత్మహత్య లేఖ తప్పించి అతను సూసైడ్ చేసుకున్నాడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఒకరేమో పురుగుల మందు తాగి చనిపోయాడు అంటే మరొకరేమో ఉరి వేసుకున్నాడు అని అంటున్నారు. కానీ రెండింటికీ సంబంధించిన ఆధారాలు అయితే ఇప్పటి వరకు లభ్యం కాలేదు.

 

IHG

 

రెండవది ఏమిటంటే మారుతి రావు చనిపోయేందుకు రెండు గంటల ముందు, అంటే 6:30 కు తన డ్రైవర్ చేత వడలు తప్పించుకొని తిన్నాడు. ఆ తర్వాత అతనికి వాంతులు అయ్యాయని కూడా తెలుస్తోంది. అసలు ఇంతకీ ఆ వడ లలో ఏం ఉంది అన్నది ఇప్పుడు పోలీసుల అనుమానం. అలాగే అతను వైశ్య భవనానికి వెళ్లే ముందు కొన్ని మందులు కొన్నాడని తెలుసు కానీ వాటిలో పురుగుల మందు కొన్నట్లు కూడా ఎలాంటి ఆధారాలు లేవు.

 

IHG

 

ఇక తరువాత అతి ముఖ్యమైన విషయానికి వస్తే అతని అల్లుడు ప్రణయ్ ని చంపిన కేసులో మారుతీరావు తో పాటు అతని తమ్ముడు కూడా జైలు పాలయ్యాడు. జైలు నుండి బయటకు వచ్చిన తమ్ముడు కోట్ల రూపాయల ఆస్తిని తన కొడుకుల పేర్ల మీద రాయాలని మారుతీరావు తో గొడవ పడినట్లు కూడా పోలీసులు తెలుసుకున్నారట. అయితే ఈ ఆస్తి తగాదాలు మితిమీరి అతని రక్తం పంచుకుని పుట్టిన వాడే ఈ పని చేసి ఉంటాడు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారట. ఏదేమైనా అతను డ్రైవర్ నుంచి కుటుంబ సభ్యుల వరకూ ఈ దొరికిన క్లూ లతో పోలీసులు అనుమానిస్తూ పక్కా నిఘా ఉంచి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: