కులం తక్కువ వాడు తో తన కూతురు పెళ్లి చేసుకుందని అగ్రవర్ణానికి చెందిన మారుతీ రావు అనే వ్యక్తి కులం తక్కువ వాడైనా దళితుడు నీ కిరాయి రౌడీల చేత చంపించాడు. 2018వ సంవత్సరంలో మిర్యాలగూడలో జరిగిన ఈ ఘటన యావత్ తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించింది. ఆర్య వైశ్య కులానికి మారుతీ రావు తన కూతురు అమృత నీ చాలా అల్లారుముద్దుగా పెంచుకోవడం జరిగింది. అయితే అమృత దళితుడైన ప్రణయ్ ని ప్రేమించింది. ఇంట్లో పెద్దలు కాదనటంతో ఎవరికీ చెప్పకుండా ప్రణయ్ నీ పెళ్లి చేసుకుంది.

 

దీంతో మారుతీ రావు తన కూతురు అలా చేయటంతో దళితుడైన ప్రణయ్ నీ కొన్ని లక్షల రూపాయలు సుపారీ ఇచ్చి బీహార్ వారి చేత కిరాయి గూండాలతో కూతురు కళ్ళముందే కడతేర్చాడు. దీంతో కటకటాలపాలయ్యాడు మారుతీ రావు. అయితే ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చిన మారుతీ రావు ...హైదరాబాద్ నగరంలో ఆర్య వైశ్య భవన్ లో పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల మీడియాలో సంచలన వార్త అయింది. ఇటువంటి తరుణంలో తన తండ్రి మారుతీరావు చనిపోవడం పట్ల అమృత సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

తన తండ్రి ఆత్మహత్య చేసుకుని చనిపోయే అంత పిరికివాడు కాదని పేర్కొంది. బాబాయ్ శ్రవణ్ మొహంలో కనీసం బాధ కూడా కనిపించలేదని...ఆస్తులు విషయంలో  కుటుంబంలో తగాదాలు ఉన్నాయని పేర్కొంది. అంతేకాకుండా తన బాబాయ్ శ్రవణ్...తన తండ్రి మారుతీరావును కొట్టినట్లు వార్తలు వినిపించాయని.. ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తాను చెప్పలేనని అమృత వ్యాఖ్యానించింది. ప్రణయ్‌ హత్యకు ముందు మారుతీరావు ఆస్తులు పంచుకోలేదని.. నేను బయటికొచ్చాక ఆస్తులు పంచుకున్నారని పేర్కొంది. దీంతో అమృత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. మరోపక్క తండ్రి మృతదేహాన్ని చూద్దామని వచ్చిన అమృతకి బంధువులు అడ్డు పడటం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: