మార్చి 8న ప్రపంచవ వ్యాప్తంగా మహిళాదినోత్సవం జరుపుకుంటున్నారు.  ఈ రోజు మహిళలకు ఎంతో గౌరవం ఇస్తుంటారు.  తాజాగా మహిళా దినోత్సవం రోజు ఓ భర్తకు భార్య బడితే పూజ చేయడం మహిళా చైతన్యానికిి ఇదో ఉదాహారణ అంటున్నారు. సాధారణంగా మనం ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు మహిళలపై ఎక్కడో అక్కడ అన్యాయాలు జరుగుతున్నాయి.. అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే చిన్న పిల్లలు, వృద్దును కూడా కామాంధులు వదలడం లేదు. చిన్నపిల్లలపై కూడా అత్యాచారాలకు తెగబడుతున్నారు.  ప్రతిరోజూ లేచి పేపర్ చూసినా, టీవీ చూసినా భార్యను భర్త   హింసించాడు  అనే వార్తలు వస్తుంటాయి.  కానీ, భర్తను భార్యకొట్టడం అన్నది రేర్ గా జరుగుతుంది.  ఇలాంటి వార్తలు బయటకు రావడం అరుదు. 

 

భార్యను కొట్టిన భర్త అనే వార్తలు బయటకు వచ్చినట్టుగా భర్తను కొట్టిన భార్య అనే వార్తలు బయటకు రావు.  బయటకు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు.   అయితే భర్తలు చేస్తున్న అన్యాయాలపై ఇప్పడు మహిళామణులు కూడా బయటకు వచ్చి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. భర్త పరాయి స్త్రిలతో సంబంధాలు పెట్టుకుంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వాళ్లకు బడితే పూజ చేస్తున్న విషయం చూస్తూనే ఉన్నాం.  తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు బాగానే చోటు చేసుకున్నాయి. 

 

భార్యలు ఉండగానే పరాయి స్గ్రీ వ్యామోహంలో పడి భార్యలను కడతేర్చడానికి కూడా వెనుకాడని భర్తల భాగోతాన్ని బట్టబయలు చేసి వారిని నడి విధిలో నిలబెడుతున్నారు.  తాజాగా ఇప్పుడు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.  అదేమంటే, భర్తను కట్టేసి కర్రతో కొడుతున్న భార్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది. అతను ఏం తప్పు చేశాడో తెలియదుగాని, కట్టేసి కర్రతో కొడుతున్న వార్త మాత్రం వైరల్ అవుతున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి: