దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది. ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు రక్కసుల మారి వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా ఉన్న యువతిపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన ఘటన ముంబైలో చోటు చేసుకుంది. యువతీ ఘట్ కోపర్ రైల్వేస్టేషన్‌కి ఒంటరిగా వెళ్లింది. ఆమె కోసం ఎదురుచూసీ బంధువులు రైలు ఎక్కేశారు. ఆమె ఒంటరిగా రైలు ఎక్కి దివా రైల్వేస్టేషన్‌లో దిగింది. ఆమె చేతిలో మనీ లేదు. డబ్బు కోసం బంగారు ముక్కు పుడక యాచకురాలితో అమ్మించాలనుకుంది. అక్కడ ఎవరు దాన్ని కొనలేదు.

 

 

దింతో యువతీ ముక్కు పుడక తీసుకొని రోడ్డుపైకి వచ్చింది. అటూ ఇటూ తిరుగుతూ రోడ్డుపై దాదాపు రెండు కిలోమీటర్లకు పైగానే వెళ్లింది. ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. మళ్లీ ఆ యాచకురాలికే చెప్పి ఎలాగొలా అమ్మించాలని అనుకుంది. యాచకురాలు రైల్వేస్టేషన్ దగ్గర నుంచీ వెళ్లిపోయి ఉంటుందేమో అని కంగారు పడింది. త్వరగా స్టేషన్‌కి వెళ్లే ఉద్దేశంతో అటుగా వచ్చిన ఓ ఆటో ఎక్కింది. ఆటో డ్రైవర్ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆమెను ఆటోలోనే ఉంచి ఓ టెంపుల్ దగ్గర వదిలి పారిపోయాడు.

 

అటుగా బైక్‌పై ఇద్దరు వస్తుంటే ఆమె జరిగిన విషయం వాళ్లకు చెప్పింది. తనను కొంచెం రైల్వేస్టేషన్ దగ్గర దింపుతారా అని అడిగింది. మంచివాళ్లు అనుకుని బైక్ ఎక్కింది. అడ్డరోడ్డు నుంచీ మెయిర్ రోడ్డు వైపు వెళ్తున్నామంటూ... వాళ్లు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ వాళ్లు కూడా ఆమెపై అత్యాచారం చేశారు.

 

ఆమెకు ఎవరిని నమ్మాలో ఏమీ అర్థం కాలేదు. చివరకు చిరిగిన బట్టలతోనే నవీ ముంబై పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఆమెను చూసి షాక్ అయ్యారు. ఆమెను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల్లో ఫుటేజ్ ఆధారంగా వాళ్లను ముగ్గుర్నీ అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: