నేటి సమాజంలోని మనుషులు మృగాళ్ల కంటే అత్యంత కిరాతకంగా మారుతున్నారని తాజాగా జరుగుతున్న దారుణాలు చూస్తుంటే చిన్నపిల్లల కైనా అర్థమవుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఒళ్ళు గగుర్పాటు కలిపించే హత్యలు నానాటికీ పెరిగిపోతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న దారుణాతి దారుణాలు సామాన్య ప్రజలందరినీ భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి నిజామాబాదులో చోటు చేసుకొని ఆ ప్రాంత ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది.




పూర్తి వివరాలు తెలుసుకుంటే... నిజామాబాద్ జిల్లా ఆర్య నగర్ లోని ఒక ఇంట్లో నివసిస్తున్న లక్ష్మి అనే వివాహితరాలు నిన్న సాయంత్రం సోఫాలో కూర్చొని టీవీ చూస్తోంది. అయితే అదే సమయంలో ఆ ఇంట్లో ఆమె తప్ప మరెవరూ లేరు. ఇది గమనించిన అయిదారుగురు గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి దొంగతనంగా ప్రవేశించారు. దాంతో ఒక్కసారిగా నిర్ఘాంత పోయిన వివాహిత అరవడానికి ప్రయత్నించే లోపే ఆ దుండగులు ఆమె నోటిని గట్టిగా ఒత్తిపట్టి ఆపై గొంతు కోసి అతి కిరాతకంగా చంపేశారు. ఇది చాలదన్నట్టు ఆమె మృతదేహం ముందు ఒక దీపం వెలిగించారు. అలాగే ఆమె కాలి వేళ్ళను చేతి గోళ్ళను కట్ చేసి రక్తపు మరకల పై పసుపు కారం చల్లారు. అయితే ఈ సంఘటన నిన్న రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.




మొదటిగా ఆ మహిళపై అత్యాచారం జరిగిందని భావించిన పోలీసులు... తరువాత ఇంట్లో 5 తులాల బంగారం పోయిందని తెలుసుకొని ఈ పని దొంగలదేనని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. సంఘటనా స్థలానికి క్లూస్ టీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు కీలకమైన ఆధారాలను చాలా జాగ్రత్తగా సేకరిస్తున్నారు. ఏది ఏమైనా ఇంత భయానక హత్యను తమ చరిత్రలో ఎన్నడూ చూడలేదని పోలీసులు చెబుతున్నారు. ఇంత భయానకంగా హత్య చేసిన దుండగులు ఎవరో అతి త్వరలోనే తెలుసుకుంటామని పోలీసులు మీడియా ముందు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: