ఈ పవిత్రభూమి రోజు రోజుకు అపవిత్రంగా మారుతుంది.. దేశప్రజల ప్రాణాలు కాపాడటం కోసం సైనికులు సరిహద్దుల్లో నా అన్న వాళ్లను మరిచి, తమ ప్రాణాలను లెక్క చేయకుండా పహార కాస్తుంటే, మదమెక్కిన కామోన్మాదులు దహించే కోరికలను అదుపులో పెట్టుకోక, విచ్చలవిడిగా చెలరేగిపోతూ, నచ్చిన ఆడవాళ్ల పొందు కోరుకుంటూ లొంగకుంటే నరమేధాన్ని సృష్టిస్తున్నారు..

 

 

నీ భారతదేశంలో ఇలాంటి నీచ నికృష్టపు వెధవలు సంచరిస్తున్నందుకు ఓ భరత మాత సిగ్గుపడుతున్నావా.. కన్నీళ్లు కారుస్తున్నావా.. అయినా నీవు కళ్లముందుకు వస్తే నిన్నుకూడా చెరబడతారమ్మా.. ఈ పాడులోకంలోని పాపాత్ములు.. ఎక్కడ ఆడది పూజింపబడుతుందో అక్కడ దేవతలు సంచరిస్తారంటారు.. మరి ఇప్పుడు లోకంలో ఆడది చెరచబడుతుంది, అందుకేనేమో రాక్షసులు సంచరిస్తూ మనుషుల్లో పైశాచికాన్ని ఉసిగొల్పుతున్నారు..

 

 

ఇకపోతే అసలు ఈ సమాజంలో ఆడపిల్లలు బ్రతకాలంటే భయడే సంఘటనలు రోజు రోజుకు ఎన్నో జరుగుతున్నాయి.. అలాంటి వాటిలో ఇప్పుడు మనం చదవబోయే దారుణమైన ఘటన నిదర్శనంగా నిలుస్తుంది.. ఆ వివరాలు పరిశీలిస్తే.. ఊళ్లో పనుల్లేక పొట్టచేతబట్టుకుని తమిళనాడుకు వలస వచ్చాడు ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఆకాశ్(29) అతని కుటుంబంతో సహా.. తాను చేసే పనికి దగ్గర్లో ఉంటుందని, సేలం జిల్లాలోని పనంగాడు పెరుమాకౌండనూర్‌లో ఇళ్లు అద్దెకు ఇల్లు తీసుకుని, తనకు దూరపు బంధువైన సన్నీ(15) అనే బాలుడిని తమతో పాటు ఉంచుకుని ఆనందంగా జీవిస్తున్నారు..

 

 

ఈ క్రమంలో ఒకరోజు వారు ఉంటున్న ఇంటినుండి వాళ్ల పది నెలల కొడుకు ఏడుపు ఏకధాటిగా వినిపిస్తుండటంతో ఎందుకు పిల్లాడు ఏడుస్తుంటే ఆ యింటినుండి ఉలుకుపలుకు లేదని అనుమానంతో స్థానికులు వచ్చి చూదగా ఆకాశ్ భార్య రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. ఏదో కీడు జరిగిందని శంకించిన వారు.. భయంతో ఆకాశ్ కోసం వెతకడంతో ఇంటి వెనుక వైపు ఉన్న తోటలో మరణించి కనిపించాడు. అతని పక్కనే బాలుడు సన్నీ కూడా విగతజీవిగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. భీతిల్లిపోయిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, అనుమానంతో చుట్టువున్న పరిసరాలను క్షుణంగా పరిశీలించారు.

 

 

ఇక ఆకాశ్ భార్య మృతదేహంపై గాయాలు ఉండడంతో గ్యాంగ్ రేప్ జరిగిందన్న అనుమానంతో ఆధారాల సేకరణలో భాగంగా సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో నలుగురు యువకులు పారిపోతున్న ఫుటేజీ లభించడంతో దర్యాప్తు చేపట్టగా, నలుగురు ఆగ్రా యువకులు అనుమాన స్పదంగా కనిపించారు.. కాగ ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో జరిగిన విషయాన్ని మొత్తం చెప్పేసారు..

 

 

అదేమంటే ఆకాశ్ భార్యపై కన్నేసిన దుర్మార్గులు ఆమెను గ్యాంగ్ రేప్ చేసే క్రమంలో ఆమె బట్టలు చించి.. గోళ్లతో రక్కి దారుణంగా సామూహిక అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా, ఆమె ప్రతిఘటించడంతో గొంతుకోసి దారుణంగా చంపేశారు. ఇంతటితో ఆగకుండా భర్త ఆకాశ్, బాలుడు సన్నీలను కూడా వెనుక ఉన్న తోటలోకి తీసుకెళ్లి చంపి పడేసినట్లు షాకింగ్ నిజాలు వెల్లడయ్యాయి. ఒకడు మాత్రం పోలీసుల చేతికి చిక్కలేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: