మనుషులను చంపడం మనుషులకు ఎంత తేలికగా మారిపోయింది.. ఇప్పుడు మనం ఉంటున్నది సమాజం అనడం కంటే జనారణ్యం అనడం ఉత్తమం.. ప్రేమించలేదని ఒకడు చంపితే, అనుమానంతో మరొకడు చంపుతాడు.. అందంగా ఉండటం కూడా ఈ లోకంలో ఆడపిల్లలకు శాపంగా మారింది.. ఇక లవ్ పేరుతో జరుగుతున్న దారుణాలు చూసైన బుద్ధి తెచ్చుకోవడం లేదు మనుషులు.. ప్రేమించడంలో తప్పులేదు కానీ ప్రేమను అవసరాలకు వాడుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్న వారు కూడా ఉన్నారు..

 

 

ఇక ట్రయాంగిల్ ప్రేమ వల్ల తల్లికూతుళ్లు ఇద్దరు ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది.. ఈ కౄరమైన చర్య దేశరాజధాని ఢిల్లీలో కలకలం రేపింది... ఆ వివరాలు తెలుసుకుంటే.. ఈస్ట్ ఢిల్లీలోని వసుంధర ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న సమ్రిత, ఆమె తల్లి సుమిత మేరి దారుణ హత్యకు గురైయ్యారు.. ఇద్దరితో ప్రేమ వ్యవహారమే వీరి మరణానికి గల కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది.. ఈ కాలంలో తల్లి తప్పుచేసిన, పిల్లలు, పిల్లలు తప్పుచేసిన తల్లిదండ్రులు మందలించి సరైన దార్లో పెట్టకపోతే ఇలా పరువుతో పాటుగా ప్రాణాలు పోవడం తరచుగా లోకంలో జరుగుతున్న విషయమే..

 

 

సమ్రిత ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఇంటర్న్‌షిప్ చేస్తుండగా, ఆమెతల్లి ఓ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మోడల్ అవుదామని ఢిల్లీ వచ్చిన విక్రాంత్ నగార్ అనే యువకుడికి సమ్రితతో పరిచయం ఏర్పడగా, కొద్ది కాలంలోనే ఆ పరిచయం ప్రేమగా మారి బెడ్ రిలేషన్ వరకు వెళ్లిందట.. వీరిమధ్య ఇలా జరుగుతుందని ఆమె తల్లికి తెలిసిన తాను అభ్యంతరం చెప్పలేదు.. అయితే ఇలాంటి పరిస్దితుల్లో సమ్రిత, విక్రాంత్ కు బ్రేకప్ చెప్పి మరొక యువకుడితో ప్రేమాయణం నడిపిస్తున్న విషయం తెలిసిన ఆ యువకుడు జీర్ణించుకోక తన స్నేహితుడు ప్రయాగ్‌తో కలసి మాజీ ప్రియురాలు సమ్రిత, ఆమె తల్లి సుమితా మేరిని కత్తులతో పొడిచి దారుణంగా హత్యచేశాడట..

 

 

ఇక చట్టం నుండి తప్పించుకుందాం అనుకున్నాడు కాని అక్కడ ఉన్న సీసీ కెమెరాలు వీరి భాగోతాన్ని బట్టబయలు చేశాయి.. కాగా విక్రాంత్ దొరకగా అతని స్నేహితుడు పరారిలో ఉన్నాడట.. చూసారా ఇద్దరితో ప్రేమవ్యవహారం చివరికి ప్రాణాలే తీసింది.. ఇలాంటివి ఎన్నిజరిగిన చావడానికైన సిద్దపడుతున్నారు గాని మనకెందుకులే ఇలాంటి పనులు అని యువత ఊరుకోవడం లేదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: