ప్రపంచంలో మనిషి దేనికి భయకపడకున్నా.. దేవుడుకి, దెయ్యానికి మాత్రం తప్పకుండా భయపడతారు.  అందుకే వీటిపై ఎన్నో చిత్రాలు వచ్చాయి.. వస్తున్నాయి.  చిన్ననాటి నుంచే మనిషికి దేవుడు అంటే ఎంత భక్తి నేర్పిస్తారో.. దెయ్యం అంటూ బూచీ వస్తుందని అంతగా భయపెడతారు.  ఈ మద్య పట్టణాల్లో ఈ జాడ్యం కాస్త తక్కువ అయినా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం దెయ్యాలు, భూతాలు, బాణామతి, చేతబడి అంటూ ఇంకా భయపెడుతూనే ఉన్నారు.  దీన్ని ఆసరా చేసుకొని దొంగబాబలు పుట్టుకొస్తూనే ఉన్నారు. స్వామీజీ అవతారమెత్తి ప్రజలను  మోసం చేసి లక్షలు దండుకుంటున్నదొంగ బాబాను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. గుప్తనిధులు వెలికి తీస్తానని, భూత  వైద్యం  చేస్తానని మాయ మాటలు చెప్పి ప్రజలనుంచి భారీగా డబ్బులు వసూలు చేయటం అతని నైజం. ఈ క్రమంలోనే ఒక మహిళను మోసిగించి కటకటాల పాలయ్యాడు దొంగ బాబా.  

 

ఒకరి ఇంట్లో వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి దెయ్యం అయి తిరుగు తున్నాడని.. త్వరలో మీ ప్రాణాలు కూడా తీసుకు పోతాడని భయపెట్టడంతో గుండెలు చిక్కబట్టుకొని ఆ దొంగబాబ చెప్పిన పనులన్నీ చేశారు.. తీరా నిజం తెలుసుకొని లబోదిబో అన్నారు. ఆ దెయ్యాన్ని  ఇంట్లోంచి వెళ్లగొడతానని చెప్పి ఆరు లక్షలు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

 

చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కొత్తవారి పల్లె పంచాయతీ, రాయుని చెరువు  వడ్డిపల్లె(ఆర్‌సీ వడ్డిపల్లె) కు చెందిన డేరంగుల రామకృష్ణ అలియాస్ రామకృష్ణ స్వామిజీ (47) మొదట కూలీ పనులు చేసుకుంటూ బతికేవాడు.. తర్వాత గుప్తనిధుల త్వకాలు చేపడుతూ  అక్కడ గోతిలో నకిలీ విగ్రహాలు పెట్టి ప్రజలను నమ్మించి లక్షలు దండుకునేవాడు. ఈవ్యాపారం బాగా సాగుతుండటంతో భూతవైద్యం కూడా చేయటం మొదలెట్టాడు.  ఈ క్రమంలోనే మదనపల్లె బుగ్గకాలువకు చెందిన షేక్‌ హసీనా ఇంట్లో దెయ్యం ఉందని భయపెట్టి లక్షలు కాజేయాలని చూసి అడ్డంగా బుక్కయ్యాడు.. కటకటాల పాలయ్యాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: