ప్రస్తుత రోజుల్లో సొంతింటి కల, కలలాగే మిగిలిపోతుంది. దీనికి కారణం అనేకం. అవ్వన్నీ చెప్పాలంటే ఒక గ్రంధమే అవుతుంది కాబోలు. అయితే కొన్ని విషయాలు మీ సొంతింటి కలని సాకారం చేసుకోవాడానికి ఉపయోగ పడుతాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోతగినది బ్యాంక్. దీని కోసం బ్యాంక్‌కు వెళ్లి లోన్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఇప్పుడు మీఅందరికి శుభవార్త. తాజాగా ఒక బ్యాంక్ హోమ్ లోన్స్‌ పై వడ్డీ రేట్లను కాస్త తగ్గించింది. 

 

 


దీనితో కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని భావించే వారికి ప్రయోజనం ఒక రకంగా  ప్రయోజనమే అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటులో కోత విధించింది. ఎంసీఎల్ఆర్‌ను 10 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఇది సంవత్సరంలో ఎప్పుడైనా పరిమితుల్లోని రుణాలకు ఇది వర్తిస్తుంది. అయితే మార్చి 11 నుంచి మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆదారిత లెండింగ్ రేటు (MCLR)ను తగ్గిస్తున్నట్లు బ్యాంక్ ఈ సందర్బంగా తెలిపింది.

 

 


దీనితో బ్యాంక్ తాజా రేట్ల కోత నేపథ్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంవత్సరానికి సంబంధించిన ఎంసీఎల్ఆర్ రేటు 8 శాతానికి తగ్గింది. ఇది వరకు ఈ ఎంసీఎల్ఆర్ రేటు కాస్త 8.10 శాతంగా ఉండేది. అయితే ఈ బ్యాంకు మాత్రం 2019 జూలై నుంచి చూస్తే ఏకంగా ఈ బ్యాంక్ వరుసగా 9 సార్లు ఎంసీఎల్ఆర్ రేటును తగ్గిస్తూ వచ్చింది. 

 

 


యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీఈవో, ఎండీ రాజ్‌కిరణ్ రాయ్ మాట్లాడుతూ.. పోయిన త్రైమాసికంలో బ్యాంక్ రిటైల్ గ్రోత్ వార్షిక సరాసరి 10 శాతంగా ఉందని తెలిపారు. అలాగే బ్యాంక్ యొక్క  పనితీరు కూడా చాలావరకు మెరుగుపడుతూ వస్తోందని అయన చెప్పుకొచ్చారు. అలాగే గత త్రైమాసికంలో బ్యాంక్ రూ.575 కోట్ల లాభాన్ని ప్రకటించామని అయన తెలిపారు. కాకపోతే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గత పాలసీ సమావేశంలో కీలకమైన రెపో రేటును తగ్గించకపోయినప్పటికీ బ్యాంకుల ఇప్పుడు రుణ రేట్లను తగ్గిస్తుండటం ఆలోచించాల్సిన విషయం అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే ఆర్‌బీఐ గతేడాది రెపో రేటును ఏకంగా 135 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. కాకపోతే బ్యాంకులు మాత్రం ఈ స్థాయిలో వడ్డీ రేట్లను తగ్గించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: