గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికలలో ఎక్కువ సీట్లు సాధించి చంద్రబాబుకి దిమ్మతిరిగిపోయే షాక్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. పార్టీపరంగా తనకు అనేక వేధింపులకు గురిచేస్తున్న చంద్రబాబుకి, తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ అధికార పార్టీ వైసిపి కి అనుకూలంగా పని చేయడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలో పనులకు సంబంధించి నిధుల విషయంలో వైసిపి.. వల్లభనేని వంశీ కి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు జోరుగా వినబడుతున్నాయి.

 

అంతేకాకుండా గన్నవరం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా బాగా చాలా ఫాస్ట్ గా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పార్టీపరంగా తనని అనేక వేధింపులకు గురి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు చెంప మీద చెల్లుమనిపించే విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీకి ఎక్కువ స్థానాలు దక్కే విధంగా దగ్గరుండి ఎన్నికల ప్రక్రియ వంశీ చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క తెలుగుదేశం పార్టీ హైకమాండ్ గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ వేసే ఎత్తుగడకు చెక్ పెట్టే విధంగా సరికొత్త రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారు.

 

ముఖ్యంగా ఇష్టానుసారంగా వంశీ మీడియా ముందే చంద్రబాబు ని మరియు నారా లోకేష్ ని బండ బూతులు తిట్టడంతో ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో గన్నవరం లో బలంగా ఉండే టీడీపీ కేడర్ ని అలర్ట్ చేసి వంశీ వేసే ప్లాన్లను చిత్తు చేయాలని ఇప్పటికే టీడీపీ హైకమాండ్ నుండి గన్నవరం టిడిపి క్యాడర్ కు ఆదేశాలు వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లోకల్ ఎన్నికలు వేడి చాలా హాట్ హాట్ గా సాగుతున్నాయి. ముఖ్యంగా మాచర్ల లో జరిగిన గొడవ చుట్టూ ఏపీ రాజకీయం తిరుగుతోంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ ఏ విధంగా గన్నవరం రాజకీయాల్లో రాణిస్తాడో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: