చదువున్న విద్యార్థులు ఎక్కువతున్నారు.. బోలెడు మంది చదివితే.. ఆవగింజంత ఉద్యోగాలు మాత్రమే లభిస్తున్నాయి.. వాటికి కూడా మనం కష్టాలు పడాలి అలాంటి సమయంలో కొంత మంది దుండగులు అమ్మాయిలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు.. అలా వారి  మోసపోయినోళ్లు చాలా మండే ఉన్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు.. ఇక్కడ అమ్మాయిలకు ఉద్యోగం ఇస్తానని చెప్పి వ్యభిచార గృహంలోకి నెట్టిన ఓ ఘటన ఇప్పుడు కదిలించి వేస్తుంది.. 

 

 


ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి బాలికను తీసుకొచ్చి వ్యభిచారం చేయాలంటూ దారుణంగా హింసించిన ఘటన వెలుగుచూసింది. ఒంటినిండా గాయాలతో రోడ్డుపక్కన నిద్రిస్తున్న బాలికను గుర్తించిన అధికారులు.. చిల్డ్రన్ హోంకి తరలించారు. ఏం జరిగిందని ఆరాతీయడంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నగరానికి తీసుకొచ్చి వ్యభిచారం చేయించి.. ప్రతిఘటించినందుకు దారుణంగా చిత్రవధ చేసిన ఘటన అధికారులను తీవ్రంగా కలచివేసింది.

 

 

 

అలా వేరే దేశాని కి చెందిన ఓ అమ్మాయి ని ఓ ముఠా బెంగుళూరుకు తీసుకొచ్చింది.. నగరంలోని కడుగోడి ఏరియా లో ఓ ఇంటి కి తీసుకెళ్లి వ్యభిచార కూపంలో కి నెట్టారు. బాలిక ప్రతిఘటించడం తో ఆమెను తీవ్రంగా దూషిస్తూ విచక్షణారహితం గా కొట్టడం తో తీవ్ర గాయాలయ్యాయి. ఎలాగైనా వ్యభిచారం చేయించాలని నిత్యం నరకం చూపారు.

 

 

 

ఒంటి నిండా గాయాల తో వచ్చిన ఆ అమ్మాయిని స్థానిక అధికారులు చూసి తక్షణం చిల్డ్రన్‌ హోంకి తరలించి ఆరా తీయడం తో సెక్స్ రాకెట్ దందా బయటపడింది. బాలికను ఉద్యోగం పేరుతో రప్పించి వ్యభిచార కూపంలోకి నెట్టాలని చూసిన ఐదుగురు బంగ్లా దేశీయుల ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక పిర్యాదు మేరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఫాక్స్ కేసు కింద కేసు నమోదు చేసి వారినిరిమాండ్ కు తరలించారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: