ఇటీవల మన సౌత్ లో మనం గమనించినట్లయితే.. సెక్స్ దందాలు పెచ్చుమీరి పోతున్నాయి. విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ... వివిధ రకాల కోణాలలో వీటిని నిర్వహిస్తున్నారు. సమాజంలో నాయకులు అనబడేటువంటి వారే వీటిని నిర్వహిస్తుండటం సిగ్గు పడాల్సిన విషయం. ఇక్కడ జరిగే ఉదంతం చదివితే మీకే అర్ధమౌతుంది... తమిళనాడులోని నాగర్‌కోవిల్‌లో ఓ మసాజ్‌ సెంటర్‌లో జరుగుతున్న వ్యభిచార కార్య కలాపాలు.. చుట్టు పక్కల వారిని నివ్వెర పోయేలా చేసాయి. వివరాల్లోకి వెళితే...

 

నాగర్‌కోవిల్‌లో సదరు మసాజ్ సెంటర్ లో సెక్స్ కార్య కలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందటంతో.. ఏఎస్పీ జవహర్‌ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు చేసారు. సదరు మసాజ్ సెంటర్‌లో దొరికిన  ముగ్గురు మహిళలను విచారించగా, వారు ఈ విధంగా పేర్కొన్నారు.. మసాజ్‌ సెంటర్‌ పేరుతో యువకులను రప్పించి ఇక్కడ వ్యభిచారం జరుపుతున్నట్లు విచారణలో తేలింది. 

 

ఇక అక్కడ దొరికిన ముగ్గురు యువతులను, యువకుడిని పట్టుకుని వివరాలు అడుగగా... ఆ యువతులు పాండిచ్చేరి, తిరుపూర్‌ ప్రాంతానికి చెందిన వారుగా పేర్కొన్నారు. వారి కాంటాక్ట్  లిస్ట్ పరిశీలించగా, వీరితో పాటు పలువురు విదేశీ వనితలు సైతం ఈ దందాలో ఉన్నట్లు తేలింది. ఇక ఇక్కడ కొసమెరుపు ఏమంటే, ఆన్‌లైన్‌ ద్వారా సదరు విటులకు వలవేసి, ఈ సెక్స్ రాకెట్ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇక పోలీసుల చేసిన ఇండెప్ట్ విచారణలో భాగంగా కొన్ని ఆసక్తికర విషయాలు తేటతెల్లం అయినాయి. 

 

ముఖ్యంగా.. ఈ మసాజ్‌ పార్లర్ కు పలు రాజకీయ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, A1 అని పిలవబడేటువంటి ప్రబుద్ధులు వస్తూ పోతూ ఉంటారట! ఇక ఈ మసాజ్‌ సెంటర్‌కు సదరు ప్రముఖులు  రెగ్యులర్‌గా వస్తున్నట్టు విచారణలో తెలిసింది. అసలు ఈ మసాజ్ సెంటర్ అటువంటి వారి కోసమే నిర్వహిస్తున్నట్లు వారు చెప్పడంతో పోలీసులు ఖంగు తిన్నారు. తదుపరి.. నిర్వాహకులను అరెస్టు చేయగా, పోలీసులు దీనిపైన రక రకాల కోణంలో విచారణ జరుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: