మాచర్లలో బుధవారం జరిగిన దాడి ఘటనపై తెలుగుదేశంపార్టీ నేత బోండా ఉమా మహేశ్వరరావు పిచ్చ క్యామిడి చేస్తున్నాడు. మాచర్లకే వచ్చి విషయం తేల్చుకుంటాను నీవు సిద్ధమేనా అంటూ మాచర్ల ఎంఎల్ఏ పిన్నెల్లి రామకృష్ణారెడ్డినే సవాలు చేయటమే విచిత్రంగా ఉంది. మాచర్లలోనే నాలుగుసార్లు వరుసగా గెలిచిన  పిన్నెల్లిని బోండా సవాలు చేయటాన్ని చాలామంది క్యామిడిగా తీసుకుంటున్నారు. ఒకసారి గెలిచిన బోండాకు నాలుగుసార్లు మాచర్లలో వరుసగా గెలుస్తున్న పిన్నెల్లిని సవాలు చేసేంత సీన్ లేదని టిడిపి నేతలే అంటున్నారు.

 

నిజానికి మాచర్ల పట్టణంలో టిడిపి నేతలపై దాడులు చేయటం తప్పే. ఎవరు ఎవరిపై దాడులు చేసినా ఖండించాల్సిందే అనటంలో సందేహం లేదు. అంతకుముందు రోజు మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడో ఓ చోట జరిగిన సంఘటనను పట్టుకుని బూతద్దంలో చూపి పెద్దదిగా చేయాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేశాడు. ఇందులో భాగంగానే ప్రత్యేకంగా ఎంఎల్సీ బుద్దా వెంకన్న, మాజీ ఎంఎల్ఏ బోండా ఉమలను ఏరికోరి మాచర్లకు పంపారు.

 

ఆమధ్య  రాజధాని రైతుల ముసుగులో టిడిపి వాళ్ళే కొందరు పిన్నెల్లి పై కొందరు దాడి చేయటంతో పాటు బుధవారం మాచర్లలో ఓ పిల్లాడిని బోండా కారు గుద్దేసిందనే ప్రచారం కూడా ఉంది. దాంతో అన్నీ కలిసి బోండా, బుద్దాలు ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగిందంటున్నారు. దాడి చేసింది కూడా వైసిపి కార్యకర్తలే అని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది.   

 

సరే దాడులు, ఎదురుదాడుల విషయాన్ని పక్కనపెట్టేస్తే ఎంఎల్ఏ పిన్నెల్లిని బోండా సవాలు చేయటమే క్యామిడిగా మారిపోయింది. పైగా పిన్నెల్లిని బోండా విజయవాడకు రమ్మని సవాలు చేయలేదు. తాను మాచర్లకు వచ్చి తేల్చుకుంటానని సవాలు చేయటమే హైలైట్ అనే చెప్పాలి. ఇదే విషయాన్ని పిన్నెల్లి చాలా లైట్ గా తీసుకున్నాడు. టివి చర్చా కార్యక్రమంలో ఇదే విషయమై ఎంఎల్ఏ మాట్లాడుతూ తనను సవాలు చేసేంత సీన్ బోండాకు ఉందా అంటూ ఆశ్చర్యపోయాడు. ఒక్కసారి మాత్రమే గెలిచిన బోండా నాలుగుసార్లు వరుసగా గెలుస్తున్న తనను సవాలు చేయటమేంటని కొట్టి పారేశాడు లేండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: