ఈ మధ్య కాలంలో టిక్ టాక్ ఎంతో మందిని ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో జనాలందరూ సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ కి ఎక్కువ మొగ్గు చూపుతున్న తరుణంలో... నెటిజన్లు అందరిని ఎక్కువగా ఆకర్షిస్తుంది టిక్ టాక్. ప్రస్తుతం ఎవరి ఫోన్ లో చూసిన టిక్టాక్ కనిపిస్తోంది. కొందరు ఇతరుల వీడియోలు చూసి ఆనంద పడితే . కొందరు వీడియోలు చేసి మురిసిపోతూ ఉంటారు. ఏదేమైనా టిక్ టాక్ వాడకం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతోంది. చిన్న పిల్లలకు నుంచి పండు ముసలి వరకు అందరూ టిక్ టాక్ లో మునిగి తేలుతున్నారు.ఇక టిక్ టాక్ వల్ల ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఎన్నో కాపురాల్లో చిచ్చు కూడా పెట్టింది.
ఇక్కడ మరో యువకుడి ప్రాణం తీసింది టిక్ టాక్. లైకుల కోసం స్టెంట్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఇక్కడ ఒక యువకుడు.ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. కిందిదియా అనే గ్రామానికి చెందిన 23 ఏళ్ల కపిల్ యువకుడు టిక్ టాక్ వీడియోలు చేస్తూ ఉండేవాడు. ఇతనికి రెండేళ్ల క్రితం పెళ్లి జరిగింది.అయితే కపిల్ అనే యువకుడు ట్రాక్టర్ నడపాలంటే ఎంతో ఇష్టపడే వారు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ నడుపుతు టిక్ టాక్ వీడియో చేస్తే ఎన్నో లైకులు వస్తాయని భావించి... డ్రైవింగ్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేసాడు.
ట్రాక్టర్ తో స్టార్ట్ స్టెంట్ ప్రయత్నం చేసాడు. ట్రాక్టర్ ను సినిమాల్లో లాగా గాలిలోకి లేపాలి అనుకున్నాడు. ఇక వేగంగా వెళుతూ ట్రాక్టర్ ముందు చక్రాలను గాలిలోకి లేపేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ నడుపుతున్న కపిల్ అదుపు చేయలేక...ట్రాక్టార్ కింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అప్పటికే టిక్ టాక్ వీడియో ఆన్ చేసి ఉండడంతో ఇదంతా రికార్డు అయింది కూడా. వీడియో తీస్తున్న వ్యక్తి మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు . ఇక ఆ యువకుడు మృతి కుటుంబంలో విషాదం ఉండిపోయింది.