టిడిపి సీనియర్ నేత ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అధికార పార్టీపై తీవ్రస్థాయిలో ఘాటు విమర్శలు చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే నిన్న టీడీపీ శ్రేణులను పరామర్శించేందుకు వెళ్లిన బుద్ధా వెంకన్న బోండా ఉమ ల పై వైసిపి వారికీ దాడి చేయడం ఆంధ్ర రాజకీయాలలో పెద్ద సంచలనం సృష్టించింది. ఇక ఈ ఘటనలో ఏకంగా ఓ  అడ్వకేట్ తల పగిలి తీవ్ర గాయమైంది. అయితే తాజాగా టీడీపీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న వైసీపీ ని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వార్థ రాజకీయాలకు  ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి కేరాఫ్ అడ్రస్ అంటూ విమర్శించారు. 

 

 స్వార్ధ రాజకీయం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ ని హత్య చేశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు బుద్ధ వెంకన్న. అలాంటిది సాధారణ బీసీ నేత అయిన తనను... వదులుతారు అనుకోవడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గొంతులో ప్రాణం ఉన్నంత వరకు చంద్రబాబు వెంటే ఉంటాను అంటూ స్పష్టం చేశారు టిడిపి సీనియర్ నేత బుద్ధా వెంకన్న. వైసీపీ విధివిధానాలు తప్పు అని లేవనెత్తి  తీవ్రస్థాయిలో పోరాడుతున్నా.. తనను  ప్రాణాలతో వదులుతారు అని నేను అనుకోవడం లేదు అంటూ బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. ప్రజల మేలు కోసం ప్రాణాలు అర్పించడానికి అయినా సిద్ధమే అంటూ తెలిపారు. 

 


 రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టినప్పటి నుంచి టిడిపి పార్టీలోనే కొనసాగుట్జున్నానని.. టిడిపి పార్టీ నేర్పిన విలువలు విధానాలకు కట్టుబడి... ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అనే నియంత పై నా పోరాటాన్ని కొనసాగిస్తూనే అంటూ సోషల్ మీడియా వేదికగా బుద్ధ వెంకన్న పోస్ట్ పెట్టారు. ఇక ప్రస్తుతం బుద్ధ వెంకన్న పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇదిలా ఉంటే నిన్న బుద్ధ వెంకన్న బోండా ఉమ పై దాడి జరిగిన నేపథ్యంలో.. ఆంధ్ర రాజకీయాల్లోకి దుమారం రేగిన విషయం తెలిసిందే. దాడి అనంతరం బుద్ధ వెంకన్న ఇలాంటి పోస్ట్ పెట్టడం మరింత  ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: