రోజు రోజుకి అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. అక్రమ సంబంధాలతో మానవ సంబంధాలు మంట కలిసి పోతున్నాయి. అయిదు నిమిషాల పడక సుఖం కోసం కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. అయితే.. తాజాగా ఒక  అక్రమ సంబంధం యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. వరసకు అన్నయ్య అయ్యే భార్యతో వివాహేతర సంబంధం ఆ యువకుడు పెట్టుకున్నాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడన్న కసితో వరుసకు అన్నయ్య అయిన వ్యక్తి ఆ యువకుడి పై పెట్రోలు పోసి నిప్పంటించాడు. కాగా., ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం అజ్జంపూడిలో గురువారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. 


వివరాల్లోకి వెళితే.. అజ్జంపూడిలో భార్య, భర్త లకి ఇద్దరు పిల్లలు పిల్లలు ఉన్నారు. అయితే వారు నివసిస్తున్న ఇంటికి సమీపంలోనే వరుసకు తమ్ముడయ్యే యువకుడు అక్కడ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే యువకుడికి అన్నయ్య వరుస అయ్యే వ్యక్తి భార్యకు అక్రమ సంబంధం ఏర్పడింది. కొంతకాలంగా కొనసాగుతున్న ఈ అక్రమ సంబంధం భర్తకు తెలిసింది. ఈ విషయాన్నీ తెలుసుకున్న భర్త వారిద్దరిని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినా వారు వినిపించుకోకుండా ఇద్దరు ఆ అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. 


కాగా., కొంతకాలానికి ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. దీంతో పరువు పోయిందని భావించిన మహిళ భర్త కఠిన నిర్ణయం తీసుకున్నాడు. అయితే.. మహిళ భర్త పన్నాగం పొంది గురువారం తెల్లవారు జామున యువకుడు బహిర్భూమికి వెళ్లిన సమయంలో దాడి చేశాడు. ఆ వ్యక్తి నైటీ, మాస్క్‌ తో వెళ్లి యువకుని కళ్లలో కారం చల్లాడు.


 అనంతరం యువకుని పై పెట్రోలు పోసి నిప్పంటించాడు. మంటల్లో కాలిపోతూ బాధితుడు రోడ్డు మీదికి రావడాన్ని స్థానికులు గమనించారు. అతడిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన పై సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా., ఆ యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: