మనిషిలో రోజు రోజుకు మానవత్వం మాయమైపోతుంది. కామంతో వావివరసలు మరిచి కామ పిశాచల తయారవుతున్నారు. అమ్మ తర్వాత బాధ్యతగా చూసుకునేది అక్క. అలాంటిది అక్కయ్యే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు. చివరకు అన్యోహ రీతిలో ప్రాణం కోల్పోయిన ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. పాకిస్థాన్‌ పంజాబ్ ప్రావిన్స్‌ లోని ముజఫర్‌‌గఢ్‌ పట్టణంలో బీబీ అనే మహిళకు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త ఉపాధి నిమిత్తం వేరే దేశంలో ఉంటున్నాడు. దీంతో ఆమె పిల్లలు, అత్తమామలతో సొంతింట్లో ఉంటోంది.

 

 

ఆమె ఇంటి సమీపంలోని వరుసకు తమ్ముడయ్యే అహ్మద్ బలూచ్(22) ఉండేవాడు. బంధువులే కావడంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్య పెరిగి అక్రమ సంబంధానికి దారితీసింది. వావివరుసలు మరిచి అక్కాతమ్ముళ్లైన వారిద్దరూ అనైతిక బంధానికి తెరలేపారు. బీబీది ఉమ్మడి కుటుంబం కావడంతో వారిద్దరూ తరుచూ కలుసుకోవడం కుదిరేది కాదు. దీంతో రాత్రివేళ అందరూ పడుకున్న తర్వాత అహ్మద్ ఆమె గదిలోకి వచ్చి పనికాచ్చేసి సైలెంట్‌గా వెళ్లిపోయేవాడు. రోజూ రాత్రిపూట ఈ తంతు కొనసాగుతూనే ఉంది.

 

 

ఓ రోజు బీబీ గదిలోకి వెళ్లిన అహ్మద్ ఆమెతో రాసలీలలు సాగిస్తుండగా ఏదో అలికిడి అయింది. దీంతో కుటుంబసభ్యులందరూ నిద్రలేచి ఇంట్లో వెతకసాగారు. తన బంఢారం బయటపడుతుందని ఆందోళన చెందిన బీబీ ప్రియుడిని ఓ చెక్కపెట్టెలో దాచేసింది. తన గుట్టు బయటపడలేదన్న సంతోషంతో బీబీ ప్రియుడిని పెట్టెలో దాచిపెట్టిన విషయం మరిచిపోయి హాయిగా నిద్రపోయింది. ఆ చెక్క పెట్టెకు ఎలాంటి రంధ్రం లేకపోవడంతో అహ్మద్ ఉక్కిరిబిక్కిరయ్యాడు. తలుపు తీయాలని కేకలు పెట్టినా అవి ఎవరికీ వినిపించలేదు. దీంతో ఊపిరాడక అందులోనే ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత ప్రియుడు గుర్తుకురావడంతో బీబీ తలుపు తీయగా విగతజీవిగా కనిపించాడు. వరుసకు అక్క అయ్యే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న అహ్మద్ చివరికి ఊహించని రీతితో ప్రాణాలు కోల్పోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: