ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు ఎన్నో తెరమీదికి వస్తున్న విషయం తెలిసిందే. వివాహేతర సంబంధాల కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్నో హత్యలు కూడా జరుగుతున్నాయి. ఎంతో అన్యోన్యంగా ఉండే   భార్య భర్తల మధ్య లోకి మూడో వ్యక్తి  రావడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక ఆ తర్వాత మూడో వ్యక్తి మోజులో పడి కట్టుకున్న వాళ్లని కడతేర్చేందుకు  సిద్ధపడుతున్నారు. ఇంకొంతమంది మహిళలని టార్గెట్ చేస్తూ పరిచయం పెంచుకుని వివాహేతర సంబంధానికి తెరలేపుతున్నారు. ఇక్కడ ఓ మహిళ వివాహేతర సంబంధం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. 

 

 భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉన్న మహిళ ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోగా..  వీరిద్దరూ కొన్నాళ్ళకి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ విషయాన్ని సదరు మహిళ అన్నదమ్ములు చెప్పగా...  చెల్లి అని  కూడా చూడకుండా అతి దారుణంగా చంపేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. ముజఫర్ నగర్ సమీపంలోని కోకోడ  గ్రామానికి చెందిన మహిళల భర్త  రెండేళ్ల క్రితం చనిపోయాడు.ప్రస్తుతం పుట్టింట్లోనే ఉంటుంది. ఇక సదరు మహిళకు అనే జుల్ ఫికర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇక పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. 

 

 ఇక ఈ విషయం సదరు మహిళ సోదరులు కనిపెట్టడంతో మహిళను ఎన్నోసార్లు హెచ్చరించారు. సోదరులు హెచ్చరించినప్పటికీ యువకుడితో మాత్రం అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది సదరు మహిళ. ఈ క్రమంలోనే వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిశ్చయించుకున్నారు . ఇక ఈ విషయాన్ని సదరు మహిళ తన అన్నదమ్ములకు చెప్పింది. ఇక తమ తోబుట్టువు చేసిన పనికి కోపోద్రిక్తులైన అన్నదమ్ములు సుమిత్  కుమార్.  సోను  దారుణంగా ప్రవర్తించారు. అక్రమ సంబంధం మానుకో అని  హెచ్చరిస్తుంటే  ఏకంగా పెళ్లి చేసుకుంటాను అని అంటావా అని  దాడికి పాల్పడి గొంతునులిమి చంపేశారూ. ఇక ఈ విషయం ఎక్కడ బయటకి పొక్కకుండా గుట్టుగా  అంత్యక్రియలు కూడా నిర్వహించారు. ప్రియురాలు కనిపించకపోవడంతో కంగారుపడిన సదరు యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ మహిళ అన్నదమ్ములు ఇద్దరు అరెస్ట్ చేసి విచారించగా నేరం  అంగీకరించారు నిందితులు .

మరింత సమాచారం తెలుసుకోండి: