భార్యాభర్తల తర్వాత గొడవలు సర్వసాధారణం. మామూలుగా ఉన్నప్పుడు ఎంత అన్యోన్యంగా ఉంటారు... కాస్త చిరాకు వచ్చినప్పుడు అంతే గొడవ పడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత అంతా మామూలే. ఇలా ఏ భార్యాభర్తల మధ్య అయినా  చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ తర్వాత రెండు మూడు రోజుల్లోనే సర్దుకుపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. ఇక ఈ కేసు చూసి పోలీసులు కూడా ఇవ్వాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ భార్యాభర్తల మధ్య ఏ విషయంలో గొడవ జరిగింది అంటారా.. ఇంట్లో స్నానం చేసే బాత్రూం విషయంలో. బాత్రూం విషయంలో జరిగిన గొడవ కాస్త ఎక్కడికో  దారి తీసింది. 

 

 

 భార్యాభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ తో భర్త పోలీసులను ఆశ్రయించాడు. ఇంతకీ ఏమి జరిగింది అంటారా... తన బాత్రూం లో స్నానం చేయడానికి  వెళుతున్న భార్యను వద్దన్న  కారణంగా భార్య తనను బూతులు తిట్టింది అంటూ  భర్త పోలీసులను ఆశ్రయించాడు. గుజరాత్లో ఈ వింత ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... గుజరాత్ అహ్మదాబాద్ కు చెందిన గాంధీ అనే వ్యక్తి ట్రావెల్ ఏజెంట్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇతనికి భార్య జూలీ ఉంది. అయితే ఓ రోజు ఉదయం.. ఆఫీస్ కు వెళ్లేందుకు రెడీ అయ్యి రూమ్ లో  సిద్ధంగా ఉన్నాడు గాంధీ. 

 

 

 ఇక అదే సమయంలో అక్కడికి చేరుకుంది భార్య జూలీ. తన బాత్రూం లో వాటర్ రావడంలేదని...నీ  బాత్రూంలో స్నానం చేసుకుంటాను అంటూ భర్తను అడిగింది. కానీ భర్త గాంధీ మాత్రం తన భార్య తన బాత్రూం లో స్నానం చేయడానికి ఒప్పుకోలేదు. నీ బాత్ రూమ్ ఉంది కదా... ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అంటూ భార్యను  అని ప్రశ్నించాడు గాంధీ. ఇంకేముంది భర్త మాట లతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు భార్య... భర్త అని కూడా చూడకుండా బూతుపురాణం మొదలు పెట్టింది... నన్ను హింసించావంటూ  కేసు పెడతా అంటూ బెదిరించింది కూడా. ఇక భార్య తీరుతో భయపడిపోయిన భర్త గాంధీ.. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భార్య పై ఫిర్యాదు చేశాడు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: