రెండు అక్షరాల ప్రేమ ఎప్పుడు.. ఎలా.. ఎవరిమధ్య పడుతుందో చెప్పడం చాలా కష్టం. ప్రేమకు మనసులు తప్పా వయస్సు, స్థాయి, అందంతో సంబంధం ఉండదు. అలాగే ప్రేమించిన వాళ్ల కోసం ఎంతకైనా తెగిస్తారు.. ఒక్కోసారి ప్రాణాలు కూడా త్యాగం చేస్తారు. ఇక తాజాగా అమీర్పేట పరసర ప్రాంతాల్లో కూడా ఇదే జరిగింది. అమీర్పేట పరసర ప్రాంతాల్లో చిత్తు కాగితాలు ఏరుకునే ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. స్నేహితుడే కత్తితో గొంతుకోసి దారుణంగా హత్యచేశాడు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రీన్పార్కు హోటల్ ఎదుట ఫుట్పాత్పై గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నాటకలోని గుల్బర్గా ప్రాంతానికి చెందిన షేక్ మోసిన్ పొట్టచేత పట్టుకుని నగరానికి వలస వచ్చాడు. అమీర్పేట్ ప్రాంతంలో అడ్డా కూలీగా.. ఇతర సమయాల్లో చిత్తుకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అతనికి ఇటీవలే దివ్య అనే మహిళతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారండంతో పెళ్లి కూడా చేసుకున్నారు. అమీర్పేట్ పరిసర ప్రాంతాల్లోని ఫుట్పాత్లనే ఆవాసాలుగా చేసుకుని బతుకుతున్నారు. అయితే మోసిన్కి బోరబండకు చెందిన అబ్బు అలియాస్ గోర అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
భార్యాభర్తలతో కలసి గోరా మద్యం సేవించేవాడు. మద్యం మత్తులో మోసిన్ భార్య దివ్యపై కన్నేసిన గోరా.. అర్ధరాత్రి వేళ ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అది గమనించిన భర్త మోసిన్ అతనిని కొట్టి త్రివంగా హెచ్చరించారు. ఇక కొన్ని రోజులకు అది మరిచిపోయిన భార్యభర్తలు మళ్లీ అతనితో మద్యం తాగారు. ఇక అప్పటి వరకూ ఇద్దరితో కలసి మద్యం తాగిన భార్య దివ్య.. పెరుగు తీసుకొస్తానంటూ సమీపంలోని దుకాణానికి వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి భర్త మోసిన్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు.
వెంటనే స్థానికుల సాయంతో దగ్గరికి వెళ్లి చూడగా అప్పటికే అతను మరణించినట్లు తెలుసింది. దీంతో వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య ఘటనపై విచారణ చేపట్టారు. అప్పటి వరకూ కలసి మద్యం తాగిన స్నేహితుడు అబ్బునే అతికిరాతకంగా మోసిన్ గొంతుకోసి పరారైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఇక ఆ తర్వాత పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.