ప్రపంచం వెన్నులో వణుకుపుట్టేలా చేస్తోంది కరోనా మహమ్మారి. ఎక్కడ చూసినా ఇప్పుడు కరోనాపై టాపిక్ నడుస్తుంది. ఇప్పటికే ఐదు వేల మంది చనిపోతే.... వేల మంది ఈ వైరస్ భారిన పడ్డారు. ప్రముఖులు సైతం కరోనా వైరస్ బారిన పడుతున్నారు. పాజిటివ్గా తేలితే.. చికిత్స తీసుకుంటున్నారు. కరోనాకు చిన్నా పెద్దా అనే తారతమ్యాలు లేకుండా ఎవరికైనా సోకుతుంది. ఆ మద్య చిప్స్ 14 నెలల చిన్నారి ప్రాణాలు తీసింది. చిన్నారి గొంతులో చిప్స్ ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక మృతిచెందింది. ఈ విషాద ఘటన మంగళవారం రాస్ అల్ ఖైమాలో చోటుచేసుకుంది. ఫిబ్రవరి 2న కరోనా వైరస్ పుట్టుకకు కేంద్రంగా భావిస్తున్న వుహాన్లోని స్థానిక ఆస్పత్రిలో ఆ చిన్నారి జన్మించాడు. బిడ్డ జన్మించడానికి ముందు తల్లికి జరిపిన పరీక్షల్లో ఆమెకు కరోనా లక్షణాలున్నట్టు తేలింది.
ఇప్పటి వరకు వృద్ధులు, యువకులు, మహిళలకు కరోనా పాజిటివ్ రాగా.. ప్రపంచంలోనే తొలిసారిగా.. అప్పుడే పుట్టిన శిశువుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా ఇప్పుడు పుట్టిన చిన్నారులకు కూడా ఈ కరోనా ఎఫెక్ట్ పడుతుందని మరోసారి తేలిపోయింది. లండన్లో అప్పుడే పుట్టిన శిశువుకు అనుమానంతో టెస్ట్లు చేయగా.. కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో, ఆ చిన్నారి కేసు ప్రపంచంలోనే అతి తక్కువ వయసులో కరోనా సోకిన కేసుగా నమోదైంది. లండన్లో ఓ మహిళ నిండు గర్భిణిగా ఉన్న సమయంలో న్యూమోనియాతో బాధపడ్డారు.. ప్రసవానికి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ఆమె ముందుగానే నార్త్ మిడిల్సెక్స్ యూనివర్సిటీ ఆస్పత్రిలో చేరారు.
ఆమె పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అప్పటికే ఆమె అనోరోగ్యంతో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శువుకు కూడా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. దీంతో, ఆ శిశువుకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో తల్లీబిడ్డను వేరు వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అప్పుడే పుట్టిన శిశువుకు వైరస్ ఎలా సోకిందనేదానిపై దృష్టి సారించారు వైద్యులు