కరోనా ప్రభావం తెలంగాణ జనజీవనంపై బాగానే పడేలా కనిపిస్తోంది. కరోనా వ్యాపించకుండా తెలంగాణ సర్కారు అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా.. తెలంగాణలో ఈ నెల 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

 

 

విచిత్రం ఏంటంటే.. కరోనా ప్రభావం తెలంగాణలో పెళ్లిళ్లపైనా పడింది. పెళ్లిళ్లు ఇది వరకే నిర్ణయమై ఉన్న నేపథ్యంలో 31 వరకు మాత్రమే వివాహ మండపాలు తెరిచి ఉంచుతామని కేసీఆర్ చెప్పారు. 31వ తేదీ తర్వాత పెళ్లిళ్లు కూడా బంద్ అని.. అనుమతించబోమని స్పష్టం చేశారు. అయితే.. ప్రజల అవసరాల దృష్ట్యా సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌ తెరిచే ఉంచుతామని కేసీఆర్ తెలిపారు.

 

 

కేసీఆర్ ఇంకా ఏమన్నారంటే.. ‘ తెలంగాణ రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదు. ఒకరు కరోనా వైరస్‌ వచ్చి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరొకరు చికిత్స పొందుతున్నారు. జన సమ్మర్థ ప్రదేశాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నాం. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఎంత ఖర్చైనా చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ప్రాథమికంగా రూ.500 కోట్లు వెచ్చించాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఎలాంటి పరిస్థితి వచ్చినా వినియోగించేందుకు వీలుగా సీఎస్‌కు ఆ అధికారాలు ఇచ్చామని కేసీఆర్ తెలిపారు.

 

 

విదేశాల నుంచి వస్తున్న వారితోనే ఈ వైరస్‌ వస్తోంది. ముఖ్యంగా వీరంతా ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్నారు. అందువల్ల శంషాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. కాబట్టి రాష్ట్ర ప్రజలు బయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో 1020 ఐసోలేషన్‌ బెడ్స్‌ అందుబాటులో ఉంచాం. మరో 321 ఐసీయూ బెడ్స్‌ ఉంచాం. ఇంకో 240 వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాం. రాష్ట్రంలో క్వారంటైన్‌ ఉంచడానికి నాలుగు ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయి. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశామని కేసీఆర్ తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: