అత్తవారింట్లో వేధింపులు తట్టుకోలేక కోడలు ఆత్మహత్య చేసుకోడం, అత్త వేధింపులు, భర్త ఆగడాలు, కట్నం కోసం భార్య పుట్టింటి వాళ్ళని వేధించడం చూశాం. కానీ ఈసారి కొత్తగా  ఒక సంఘటన  కలకలం రేపింది.నా మరణానికి అత్త, మామలు కారణం అని ఒక యువకుడు  డైరీ లో రాసి మరి బలవన్మరణానికి పాలపడ్డాడు. ఈ ఘటనతో గుంటూరులో కలకలం రేగింది.

 

 

 

అసలు వివరాలలోకి వెళితే... గుంటూరు నగరం అరండల్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్టు కేసు నమోదు అయింది. మంగళగిరి పట్టణానికి చెందిన సీహెచ్ మణికంగ(29) శనివారం అత్తగారింటి ముందే సైనేడ్ తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఏమి కుటుంబ కలహాలు ఉన్నాయో తెలియదు కానీ మణికంఠ ఆత్మహత్యకి పాల్పడ్డాడు. అర్ధరాత్రి  రోడ్డుపై గిలగిలా కొట్టుకుంటున్న మణికంఠ నోటివెంట నురగలు రావడాన్ని చూసిన స్థానికులు పురుగుల మందు తాగాడేమోనని అనుకుని వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే అతడు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.

 

 

 


డాక్టర్లు చెప్పిన విషయం తెలిసి అందరు నిర్ఘాంత పోయారు. అందరు అనుకున్నట్లు తాగింది పురుగుల మందు కాదు. అతడు తాగించి పురుగుల మందు కాదని సైనేడ్ అని డాక్టర్లు  చెప్పడంతో అందరూ షాకయ్యారు.అసలు షాక్ అవ్వవలిసిన విషయం ఏంటంటే మణికంఠ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసినా అతడి అత్తమామల్లో ఎలాంటి చలనం లేకపోవడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారింట్లో తనిఖీ చేయగా ఓ డైరీ దొరికింది. తన చావుకు అత్తమామలే కారణమని రాసి ఉండటంతో వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ఏది ఏమయినా ఒక నిండు ప్రాణం భలి అయింది. అతనికి పెళ్లి అయిందా లేదా...?  భార్య ఉందా...? లేదా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: