కరోనా కోరల కింద ప్రపంచం బిక్కు బిక్కు మంటూ బతుకుతున్న వేళ, రక రకాల నివారణ మార్గాలివిగో అంటూ.. మనం చాలా వాటిని సోషల్ మీడియా పుణ్యమాని చూస్తూనే వున్నాం. అలాగే రీసెంటుగా, కరోనా నుంచి కాపాడుకోవడానికి గోమూత్రం చక్కని ఔషధంలా పనిచేస్తుందని, అఖిల భారతీయ హిందూ మహాసభ పిలుపును ఇచ్చింది. ఈ సందర్భంగా ‘గోమూత్ర పార్టీ’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో స్వామి చక్రపాణి మహరాజ్ సహా ఆయన బృంద సభ్యులు గోమూత్రాన్ని సేవించడం విశేషతను సంతరించుకుంది.

 

ఇక్కడ చెప్పుకోవలసిన విషయం ఏమంటే, సదరు కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 200 మందికి పైగా ఈ  గోమూత్రాన్ని అత్యంత ప్రీతితో సేవించారు. ఈ సందర్భంగా స్వామి చక్రపాణి మాట్లాడుతూ.. కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.. ఆ మధ్య కేరళలో వరదలు రావడానికి గల కారణం, గో వ్యధ అని, ఇక దాన్ని తిన్న వారికి మరణం తధ్యం అని జోస్యం చెప్పారు. 

 

IHG

 

ఇక గోమూత్రం సేవించిన వారికి కరోనా దరిదాపులకు రాదని, దేశవ్యాప్తంగా ఇలాంటి ‘గోమూత్ర పార్టీ’లను మరిన్ని ఏర్పాటు చేసి, ప్రజల్లో అవగాహన పెంచుతామని, ఈ సందర్భంగా స్వామి చక్రపాణి మహరాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఓ ప్రకాష్ మాట్లాడుతూ... తాము 21 సంవత్సరాల నుంచి గోమూత్రం తాగుతున్నామని, అలాగే సర్వ రోగ నివారణ కోసం.. ఆవు పేడతో స్నానం చేస్తున్నామని పేర్కొన్నారు. అదే సభకు విచ్చేసిన వి సుకుమార్ మాట్లాడుతూ..  ప్రతిరోజూ గోమూత్రం తాగినవారికి ఇక డాక్టర్ తో పనిలేదని, ఇక వారికి ఇంగ్లిష్ మందులు వాడాల్సిన అవసరం ఉండదని గట్టిగా చెప్పారు.

 

డాక్టర్ ఓబులేశు మాట్లాడుతూ... కేన్సర్‌ను నివారించేందుకు గోమూత్రం దివ్యమైన ఔషధంలా పనిచేస్తుందని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు బీజేపీ నేతలు "గో మూత్రం సర్వ రోగ నివారిణి" అనే అంశాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేయాలని, అపుడే ఈ మహమ్మారి అంతం కాగలదని.. తద్వారా... ప్రపంచం సుభిక్షంగా.. క్షేమంగా ఉంటుందని ఈ సందర్భంగా వారు హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: