చంద్రబాబు నాయుడు.. 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నోడు. అయితే ఎం లాభం.. 40 ఏళ్ళ ముందు ఉన్న అదృష్టం ఇప్పుడు లేదు. అందుకే ఈ కష్టాలు అన్ని కూడా. అప్పుడు అంటే ఏదో అదృష్టం మీద.. మామ వల్ల రాజకీయాల్లో నిలిచాడు. ఇప్పుడు అంతలేదు మరి. ఎందుకంటే అయన కంటే తెలివైన వాళ్ళు ఉన్నారు కాబట్టి.
అయన కంటే గొప్ప నాయకులూ ఉన్నారు కాబట్టి. అసలు నిజం చెప్పాలి అంటే? గత నలభై ఏళ్లలో చంద్రబాబు చేసిన తప్పులు అన్ని బయటకు వచ్చాయి. కుర్ర నాయకుడు 2019 ఎన్నికల్లో చిత్తు చిత్తు చేశాడు కాబట్టి. ఆ అవమాన భారం తట్టుకోలేక వైసీపీ ప్రభుత్వంపై ఎన్నో నిందలు వేశాడు.
రాష్ట్రం అంత అల్లర్లు సృష్టించాడు.. ఏవేవో చేస్తూ తిరిగాడు.. అయినా పెద్దగా ఉపయోగం లేదు. అల్లర్లు సృష్టించి రాజకీయాన్ని వేడి ఎక్కించారు అంటే నమ్మండి. అయినా ఎం అవ్వలేదు అంటే నమ్మండి. నిజానికి చంద్రబాబు కూడా అలా అనుకోని ఉండదు. సీఎం జగన్ హావ ఇంత ఉంటుంది అని.. నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు చేస్తున్నారు.
ఇక పోతే కనీసం ఈ స్థానిక ఎన్నికల్లో ఒకటో రెండో అక్కడక్కడ గెలవవచ్చని అనుకున్నారు... అయితే ఇప్పుడు ఏకంగా ఒకటిన్నర నెల పాటు ఎన్నికలు వాయిదా పడటంతో ఇక టీడీపీలో ఉన్న వాళ్లు చాలా మంది గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వైసీపీలోకి వెళ్లిపోతారు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. అంటే దీన్ని బట్టి చూస్తే.. సీఎం జగన్ ఏ కాదు చంద్రబాబును చివరకు కరోనా వైరస్ కూడా వెంటాడి దెబ్బ కొట్టింది.