ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్నది ఏదంటే కరోనా వైరస్. చైనా నుంచి భారత దేశం లోకి కూడా ప్రవేశించింది. ఇప్పుడు  ప్రస్తుతం భారత్‌లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్ రెండో దశ కొనసాగుతోంది.భారత్‌లో ఈ వైరస్‌ వ్యాప్తి రెండో దశలో ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వైరస్‌ కట్టడి చేపట్టాల్సిన అన్ని ప్రత్యామ్నాయాల్నీ సూచించింది. వైరస్ రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలిని స్పష్టం చేసింది.మాస్కులు, శానిటైజర్లను నిత్యావసర వస్తువులుగా ప్రకటించి వాటి తయారీని పెంచాలని సదరు సంస్థలను ఆదేశించింది."కౌగిలింత వద్దు, కరచాలనం ముద్దు"అని, నోటికి మాస్క్ ధరించాలని, చేతులని ఎప్పటికి అప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలిపింది.దగ్గు, జ్వరం, జలుబు, ఛాతి నొప్పి లాంటివి ఉంటే వెంటనే ఆసుపత్రిలో చికిత్స చేసుకోవాలని తెలిపింది. 

 

అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపాలిటీ అండ్ పంచాయతీ ఎన్నికలకి బ్రేక్ పడింది. కరోనా వైరస్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోనూ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు. ఈ ప్రక్రియను ఆరు వారాలు పాటు వాయిదావేసినది ఏపీ ఎన్నికల కమిషన్.ఇదిలా ఉంటే  దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లను మూసివేశారు. తమిళనాడు ప్రభుత్వం మార్చి 31 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించింది.ఈశాన్య రాష్ట్రం అసోం సైతం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్విమ్మింగ్ పూల్స్, సినిమా థియేటర్లను మార్చి 29 వరకు మూసివేస్తున్నట్టు అసోం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు.దేశంలో ఇప్పటి వరకు 107 కేసులు నమోదయినట్టు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 31 కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం వరకు మహారాష్ట్రలో 12 కొత్త కేసులు నమోదు కాగా.. ఆ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 31కి చేరింది. కేరళలో ఈ సంఖ్య 22కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో 11గా నమోదైంది. ఇక హరియాణాలో 14 కేసులు ధ్రువీకరించగా వారంతా విదేశీయులే అవడం గమనార్హం. తాజాగా, కోచ్చిన్ ఎయిర్‌పోర్ట్‌లో ఓ బ్రిటన్ పౌరుడికి కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. అయితే బ్రిటన్‌కు చెందిన ఈ వ్యక్తితోపాటు మరో 19 మంది కేరళ పర్యటనకు వచ్చినట్టు అధికారులు తెలిపారు. కానీ ఈ వైరస్ బాధితుడికి  వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిసిన గాని,  అక్కడ  ఉన్న  అధికారులకు సమాచారం ఇవ్వకుండా మున్నార్ నుంచి వీరంతా కొచ్చిన్‌కు చేరుకున్నారని పేర్కొన్నారు. ఎమిరైట్స్ విమానం ద్వారా లండన్ వెళ్లేందుకు వీరంతా సిద్ధమైనట్టు తెలిపారు. 

 

కానీ  వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో మొత్తం 19 మందిని విమానం నుంచి కిందికి దించి, వైద్య పరీక్షల కోసం తరలించారు. వీరితో సహా మొత్తం విమానంలో ప్రయాణించే 289 మందిని విమానం నుంచి కిందికి దింపేసినట్టు అధికారులు వివరించారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పటిదాకా  విమానాశ్రయాల్లో 12,29,363 మందిని స్క్రీనింగ్ టెస్ట్స్  చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: