ప్రస్తుత కాలం లో వ్యభిచారం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పలుప్రాంతాల నుంచి అమ్మాయిలను తరలించి అంగడిబొమ్మ లుగా చేసే దుష్కృత్యాలు కొనసాగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లోని దాదాపు అన్నిజిల్లాల్లోనూ ఈ చీకటి కార్యకలాపాలు సాగుతుండగా...తమిళనాడు, ఒడిషా, బీహార్లలో వేశ్యావాటికలకు తరలిపోతున్న ఆడపిల్లల కథలు ఎనెన్నో అని చెప్పాలి. ముఖ్యంగా ఐటీ, బీటీ కంపెనీల ఉద్యోగులను, విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన వ్యక్తులు, శ్రీమంతులను టార్గెట్ చేసుకుని స్పా ముసుగులో హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారు.
అమ్మాయిలకు ఎక్కువ నగదు ఆశ చూపి వారిని హైటెక్ వ్యభిచారం కూపంలోకి లాగి కష్టం లేకుండా డబ్బులు సంపాధిస్తున్నారు. మసాజ్ సెంటర్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచార కేంద్రాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్ పోలీసులు బయటపెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లాసుడియా పోలీస్స్టేషన్ పరిధిలోని మహాలక్ష్మి నగర్ ప్రాంతంలో కొద్దిరోజులుగా నేచుర్ స్పా పేరుతో మసాజ్ సెంటర్ నడుస్తోంది. దీంతో అప్పటి నుంచీ మగవాళ్లు ఆ మసాజ్ సెంటర్పై తెగ ఎగబట్టారు. ఇది గమనించిన స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు.
అప్పుడు పోలీసులు మసాజ్ సెంటర్పై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే పక్క సమాచారం అందుకున్న పోలీసులు గురువారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఆ సెంటర్పై రైడ్ నిర్వహించారు. దీంతో అక్కడ 9 మంది బాలికలు, ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలికలు సిక్కిం, పశ్చిమబెంగాల్కు చెందినవారుగా గుర్తించారు. ఇక పోలీసులు రైడ్ చేసిన సమయంలో రెండు జంటలు గదిలో నగ్నంగా ఉన్నాయి. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దుస్తులు వేసుకున్న తర్వాత స్టేషన్కు తీసుకెళ్లారు. ఇక మసాజ్ సెంటర్ యజమాని ఆకాష్ జోగి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.