ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువయిపోయాయి. జనాలు వావి వరసలు మరిచిపోయి మరి ఎంతకైనా తెగిస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. శారీరక సుఖం కోసం జనాలు ఎంతమైనా తెగిస్తున్నారు. వదిన అంటే తల్లితో సమానమైన విషయాన్ని కూడా మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు జనం ప్రవర్తిస్తున్నారు. వివాహ బంధాలకి విలువ లేకుండా. అన్న, తమ్ముడు తోబుట్టువ బంధాలకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అనైతిక బంధాలకే పెద్దపీట వేస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కుటుంబాన్ని పోషించుకునేందుకు భార్యా బిడ్డలను సైతం వదిలి విదేశాలకు వెళ్లిన ఓ వ్యక్తి అక్రమ సంబంధం ఇటీవలె బయటపడింది. మరిదితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ.. భర్త విదేశాల నుంచి రావడంతో ఆందోళన చెందింది.
తమిళనాడులోని చెందిన మురుగదాసన్కు భార్య సునీత, ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబానికి ఏ లోటు రాకూడదన్న ఉద్దేశంతో దుబాయ్కి వెళ్ళి బాగా డబ్బులు సంపాదించుకోవాలని భార్యబిడ్డలను వదిలి వెళ్ళాడు. సౌదీ అరేబియాకు వెళ్లి ఉద్యోగంలో చేరాడు. 2013, జనవరి 6న బావమరిది పెళ్లి ఉండటంతో స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి మళ్ళీ సౌదీఅరేబియాకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో అతడు కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసికుని దర్యాప్తును చేపట్టారు. పోలీసులు అతడి ఇంటిని తనిఖీ చేయగా పాస్పోర్టు లభించింది. దీంతో మురుగదాసన్ సౌదీకి వెళ్లలేదని నిర్ధారించుకున్నారు.
కొద్దిరోజుల తర్వాత మురుగదాసన్ భార్య, అతడి చిన్న తమ్ముడు కూడా ఆకస్మికంగా మాయమయ్యారు. దీంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. మురుగదాసన్ తల్లి పవనమ్మాళ్కు వారిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై మరికాస్త లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొన్ని విషయాలు తెలుసుకుని షాక్కి గురయ్యారు. మురుగదాసన్ సౌదీలో ఉన్న సమయంతో అతని తమ్ముడు సింగారతోపులో ఉంటున్న వదిన వద్దకు వచ్చేవాడని. ఆమె బాగోగులు చూసుకుంటూ కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చేవాడని అంతేకాక. ఈ క్రమంలోనే సునీత ఆమె మరిది మధ్య చనువు ఏర్పడి అనుకోకుండా వివాహేతర సంబంధానికి దారితీసిందని తెలిసింది. వీలు చిక్కినప్పుడల్లా అతడు వదిన ఇంటికి వచ్చి రాసలీలలు కొనసాగించేవాడు.
ఇక ఈ విషయం తెలుసుకున్న భర్త పద్ధతి మార్చుకోవాలని ఇద్దరినీ గట్టిగా హెచ్చరించాడు. బావమరిది పెళ్లి నిమిత్తం భర్త ఇంటికి రావడంతో ఆమెకు ప్రియుడితో సరసాలు ఆడేందుకు వీలు చిక్కడం లేదు. దీంతో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని మరిదితో కలిసి ఇంట్లో నిద్రపోతున్న భర్తను గొంతు నులిమి చంపేసి ఇంట్లోనే పాతిపెట్టేశారు. పోలీసులు ఓ వైపు ఈ కేసు పై దర్యాప్తు చేస్తుండగానే వీళ్ళిదరూ కేరళకి పారిపోయారు. ఆరేళ్ల తర్వాత వారి ఆచూకీ కనిపెట్టిన పోలీసులు తమదైన శైలిలో విచారించడం మొదలు పెట్టారు. దాంతో అసలు కథ అంతా బయటపడింది. దీంతో వారిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.