రాజ్యాలు మారుతున్న కొద్దీ లంచాలు కూడా బాగా ఎక్కువగా తీసుకుంటున్నారు బడా బాబులు.. అయితే ఇంటి పన్ను, కూర్చున్న పన్ను నిలుచున్న పన్ను ఇలా ఒకటేమిటి ఏది చేసిన పన్ను అంటూ చాలా మూర్ఖంగా ఆలోచిస్తూ వస్తున్నారు. మరీ దారుణంగా ఏంటంటే కడుపులో పెరిగే బిడ్డకు కూడా పన్ను అంటూ ఓ ముఠా రెచ్చిపోతుంది. అతి దారున్నగా ఈ పన్నులు వేస్తూ రచ్చ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. విస్తు పోయే నిజాలు ఇక్కడ బయటకు వస్తున్నాయి. కర్ణాటక రాజధానిలో ఈ ఘటన చోటు చేసుకుంది.. ఆర్థిక ఇబ్బందులతో ఎవరి బిడ్డనో మోసి కని ఇచ్చేందుకు బేరం కుదుర్చుకున్న సరోగసీ మదర్పై కన్నేసిన ఆడ ముఠా దారుణానికి పాల్పడింది. ఆమె కష్టంలో వాటా కావాలని బెదిరింపులకు దిగి చివరికి ఆమెని ఆస్పత్రి పాల్జేసిన అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సాటి మహిళ అని.. కడుపుతో ఉన్నదని కూడా చూడకుండా దారుణంగా కొట్టి పిండాన్ని చిదిమేసిన అత్యంత అమానవీయ సంఘటన చోటుచేసుకుంది.
మనిషి ప్రాణాలను కూడా ఇక్కడ లెక్కచేయడం లేదు.. కేవలం డబ్బుల కోసం ఓ పిల్లలు పుట్టని తల్లి ఆశలను చిదిమేసి.. ఆర్థిక బాధల నుంచి బయటపడే గత్యంతరం లేక అమ్మతనాన్ని అరువిచ్చిన ఓ మహిళ కష్టాలను అవహేళన చేసిన ఆడ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా సంఘాల ముసుగులో బలవంతపు వసూళ్లు చేసేందుకు బెదిరింపులకు దిగిన ముఠా.. డబ్బులివ్వలేదని దారుణ మారణకాండకు పాల్పడడం కలకలం రేపింది..
పిల్లలు పుట్టే భాగ్యం లేదని బాధపడుతున్న మహిళ ఎలాగైనా తల్లిని కావాలంటూ వైద్యులను సంప్రదించింది. అందుకు వైద్యులు సరోగసీ విధానాన్ని సూచించారు. దంపతుల నుంచి జన్యువులను సేకరించి వేరొకరి కడుపులో బిడ్డను పెంచేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకోసం మరో మహిళను బేరం కుదిరింది.. దాంతో ఆ మహిళా బిడ్డను కనేందుకు ఒప్పుకుంది.. చివరికి అక్కడకు కూడా ఆడ ముఠా ఓర్వలేక పోయింది..
గర్భిణిపై మూకుమ్మడిగా దాడి చేసింది. ఆమె కేర్టేకర్లపై కూడా దాడికి పాల్పడ్డారు ముఠా సభ్యులు. సరోగసీ మదర్ కడుపులో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలింది. తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో కేర్టేకర్లు ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గర్భస్రావం అయినట్లు నిర్ధారించారు. జరిగిన ఘటనను పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు..