ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల వల్ల కాపురాలు నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వివాహేతర సంబంధం యువకుడి దారుణ హత్యకు కారణమైంది. వివాహిత బంధువులు కేబుల్ కుర్రాడు తరచూ వారి ఇంటి ముందు సంచరిస్తూ ఉండటం గమనించి ఆరా తీయడంతో వారికి అసలు నిజం తెలిసింది. ఆ తర్వాత అతడిని నమ్మకంగా ఎవరూ సంచరించని ప్రదేశానికి పిలిపించి దారుణంగా హత్య చేశారు. 
 
పూర్తి వివరాలలోకి వెళితే 25 ఏళ్ల చంద్రమౌళి ఒక ప్రైవేట్ కేబుల్ కంపెనీలో గత కొన్ని నెలలుగా పని చేస్తున్నాడు. మార్కాపురానికి చెందిన ఒక వివాహితతో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. తమ ఇంటి ముందు తరచూ చంద్రమౌళి తిరుగుతూ ఉండటంతో మహిళ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. తీగ లాగితే డొంక కదిలి ఇద్దరి రాసలీలల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 
 
మొదట వివాహిత కుటుంబ సభ్యులు చంద్రమౌళిని పిలిపించి పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా చంద్రమౌళి ప్రవర్తనలో ఏ మాత్రం మార్పు రాలేదు. వివాహేతర సంబంధం గురించి బయట తెలిస్తే కుటుంబం పరువు పోతుందని చంద్రమౌళిని హత్య చేయడానికి ప్రణాళిక రచించారు. చంద్రమౌళి స్నేహితుడి ద్వారా అతడిని ఎవరూ సంచరించని ప్రదేశానికి తీసుకెళ్లి అతి కిరాతకంగా చంపేసి అక్కడే శవాన్ని పడేశారు. 
 
కొడుకు ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన చంద్రమౌళి కుటుంబ సభ్యులు సమీపంలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. చంద్రమౌళి కాల్ డేటా ఆధారణంగా విచారణ చేయగా వివాహిత బంధువులు హత్య చేశారని తేలింది. పోలీసులు చంద్రమౌళి మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివాహిత బంధువులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: