ఈ మద్య అక్రమ సంబంధాల నేపథ్యంలో కట్టుకున్నవారిని... నమ్ముకున్నవారిని దారుణంగా చంపేస్తున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. వివాహ బంధంతో ఒక్కటైన జంట ఇతరుల మోజులో పడి ఒకరినొక్కరు చంపుకునే దారుణ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అంతే కాదు తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నారని కన్న పిల్లలను సైతం హతమారుస్తున్నారు కొంత మంది ఆడవారు.. మగవారు. అయితే పాపం ఎప్పటికీ దాగదు... అన్నట్లు ఇలాంటి ఇల్లీగల్ వ్యవహారాలు నడిపించేవారు పోలీసులుకు అడ్డంగా బుక్ అవుతున్నారు. తాజాగా ఓ మహిళ తన ప్రియుడితో లైంగిక కార్యక్రమంలో ఉండగా చూశాడని వ్యక్తిని ఈ సంగతిని అతను తన భర్తకు ఎక్కడ చెబుతాడోనని భయపడింది. దీంతో ప్రియుడితో కలిసి బంధువును హత్యచేసింది. అనంతరం పారిపోతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడు రాష్ట్రం మధురై తిరుమాల్ తాలూకా చెన్నైమెట్టు తూర్పువీధికి చెందిన సుబ్బయ్య, లక్ష్మి (32) దంపతులు. లక్ష్మి బంధువు పేతురాజ్ వాళ్లింట్లోనే ఉంటున్నాడు. కొంత కాలంగా పేతు రాజ్ ఇంటి సభ్యులకు బాగా దగ్గరయ్యాడు. అయితే లక్ష్మికి శివగంగై జిల్లా ఇడయ మేలూరుకు చెందిన పాండితో వివాహేతర సంబంధం ఉంది. ఈ నెల పదో తేదీన తన భర్త లేని సమయంలో పాండిని పిలుపించుకొని అతనితో రాసలీలల్లో మునిగిపోయింది లక్ష్మి. అయితే వారి శృంగార కార్యక్రమాన్ని రెడ్ హ్యండెడ్ గా చూశాడు పేతు రాజు. పేతురాజ్ చూడడాన్ని గమనించిన లక్ష్మి ఆందోళన చెందింది. భర్తకు చెప్పేస్తాడేమోనని భయపడింది.
ప్రియుడితో కలిసి పేతురాజును చంపేసింది. అనంతరం లక్ష్మి, పాండిలో రైలులో పారిపోయారు. అయితే పేతు రాజు హత్య విషయంపై ఆయన కుటుంబ సభ్యులు లక్ష్మి, పాండి లపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగి పోలీసులు లక్ష్మి, పాండిల ఫొటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు, రైల్వే స్టేషన్లకు పంపించారు. దీంతో తిరువత్తూరు జిల్లా జోలార్ పేట రైల్వే సీఐ వడివు కరసి స్టేషన్లో నిఘావేసి ఉండగా చెన్నై నుంచి బెంగళూరు వెళ్తున్న మైసూర్ ఎక్స్ ప్రెస్ లో నిందితులు ప్రయాణిస్తున్నారన్న సమాచారం అందింది. అలర్ట్ అయిన పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.