ప్రస్తుతం ప్రపంచ దేశాల ప్రజలు అందరూ కరోనా  వైరస్ ప్రభావంతో చిగురుటాకులా వణికిపోతున్న విషయం తెలిసిందే.. అయితే మొదట చైనా దేశంలో గుర్తించబడిన ఈ ప్రాణాంతకమైన వైరస్ చైనా దేశంలో కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ... ఇతర దేశాల్లో మాత్రం విజృంభిస్తు  మరణ మృదంగం మోగిస్తుంది. దీంతో ప్రపంచ దేశాలు ప్రాణభయంతో బెంబేలెత్తిపోతున్నారు. ఇక ఇప్పటికే వంద దేశాలకు పైగా ఈ ప్రాణాంతకమైన వైరస్ వ్యాప్తి చెందిన విషయం తెలిసిందే. ఇక ఈ వైరస్ కు  సరైన వాక్సిన్ కూడా లేకపోవడంతో ప్రస్తుతం ప్రజల్లో  మరింత ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని దేశాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది. 

 

 ఇక భారతదేశంలో కూడా ఈ ప్రాణాంతకమైన వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమందిని హడలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈ వైరస్ వ్యాప్తిని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ఇక ముఖ్యంగా ఇటలీ దేశంలో అయితే ఈ కరోనా  వైరస్ ప్రభావం మరీ ఎక్కువగా ఉంది. ఇటలీ దేశంలో ఈ ప్రాణాంతకమైన వైరస్ ప్రభావం వల్ల రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతుంది. ఈ వైరస్ బారినపడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతోంది. దీంతో ఇప్పటికే ఇటలి దేశం మొత్తం స్వీయ దిగ్బంధంలో కి వెళ్ళిపోయింది. అయినప్పటికీ కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. 

 

 

 అయితే కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టేందుకు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇటలీలో ఇద్దరు వ్యక్తులు కరోనా వైరస్ బారి నుంచి బయటపడ్డారు. ఇక ఈ ప్రాణాంతకమైన వైరస్ నుంచి బయటపడడానికి ఆ ఇద్దరు వాడిన మందులు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. ఎయిడ్స్ వ్యాధికి వాడే మందులను వాడటం వల్ల ఆ ఇద్దరు వ్యక్తులు ప్రాణాంతకమైన మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇటలీ నుంచి జైపూర్ కు  వచ్చిన ఈ జంటకు కరోనా సోకడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. వారికి మరోసారి పరీక్ష నిర్వహించగా కరోనా  నెగిటివ్ అని తేలింది. అయితే ఆంటీ హెచ్ఐవి మందులు వాడటం వల్ల కరోనా వైరస్ తగ్గింది అని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: