కడప జిల్లాలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. కడప జిల్లా వల్లూరు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన మేపూరు శంకర్ రెడ్డికి ఐదు రోజుల కిందటే వివాహం జరిగింది. ఈ లోపే దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 5రోజుల కిందట మేపురు శంకర్ రెడ్డికి కమలాపురం మండలం గోపాలపురం గ్రామానికి చెందిన యువతితో ఐదు రోజుల క్రితం వివాహం జరిగింది. పెళ్లయి వారం రోజులు గడవక ముందే పెళ్ళికూతురు కాళ్ళకి పెట్టిన పారాణి ఆరకముందే చిన్న వయసులో భర్తను కోల్పోయింది మహిళ. ఆ వివాహిత భర్తను కోల్పోయినందుకు లబోదిబోమంటూ కుమిలిపోతుంది.

 

 

వివరాల్లోకి వెళితే..  పెళ్ళయ్యి వారం రోజులు కూడా గడవకముందే..  ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కడప జిల్లాలో అందరి చేత కంటతడి పెట్టిస్తుంది. ఈ క్రమంలోనే వల్లూరు మండలంలోని తప్పెట్ల బ్రిడ్జి వద్ద సోమవారం ఉదయం శంకర్ రెడ్డి ప్రాణాలు విడిచి విగతజీవిగా పడి ఉన్నాడు. 

 

 

ఈ ఘటన గురించి సంచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఆ స్థలాన్ని పరిశీలించి తర్వాత మేపురు శంకర్ రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంతలో ఈ సమాచారం అందుకున్న మృతుడి కుటుంబ సభ్యులు, అతని భార్య హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. అయితే.. మృతునికి పెళ్లి జరిగి వారం రోజులు కూడా తిరగక ముందే శంకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవటంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

 

అసలు శంకర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. శంకర్ కి వేరే ఇంకేమైనా ప్రేమ వ్యవహారం ఉందా.?? అనే కోణంలో పోలీసులు అనుమానాస్పద కేసుగా దర్యాప్తు చేసుకుని విచారిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: