తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నియమితులయ్యారు. ఆర్ ఎస్ ఎస్ పెద్దల దీవెనలు పుష్కలంగా ఉండటంతో తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవిని ఈజీగా పొందగలిగారు. ఫస్ట్ టైం అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత హైదరాబాదు నగరంలో అడుగుపెట్టిన తరుణంలో మొట్టమొదటి కార్యక్రమంలో కెసిఆర్ కి నిద్రలేకుండా చేసే విధంగా సంజయ్ ప్రసంగించారు. టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ మరోపక్క మజ్లిస్ పార్టీకి కూడా చురకలు వేశాడు బండి సంజయ్. హిందుత్వ వాదిగా పేరు ఉన్న సంజయ్ ప్రసంగాన్ని భారత్ మాతాకీ జై, జై శ్రీ రాం రామ లక్షణ జానకీ జై బోలో హనుమాన్ కి అంటూ స్టార్ట్ చేశారు. పార్టీలో ఉన్న కింద క్యాడర్ కు ఉత్సాహం నింపే విధంగా మాట్లాడుతూ….రాబోయే సార్వత్రిక ఎన్నికలలో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని ఇదే తన టార్గెట్ అని తెలంగాణ బిజెపి కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

 

కరోనా వైరస్ తో భయపడి పోతున్న కెసిఆర్ కి..కమలం భయం పట్టుకునే విధంగా పార్టీ కార్యకర్తలు నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం నుండి నిధులు రావడంలేదని కెసిఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్లు వేశారు. కేంద్రం వద్దకు వచ్చే దమ్ము కెసిఆర్ కి ఉందా? వస్తే నిధులు ఇప్పించి దమ్ము నాకు ఉందని సవాల్ విసిరారు. మతతత్వ పార్టీ అంటూ హిందువులపై అరాచకం అక్రమ కేసులు పెడితే ఖబడ్దార్ కేసీఆర్ నీ గుండెల్లో నిద్రపోతా అని హెచ్చరించారు. బైంసా లో చిన్నారులు మహిళలు తమ్ముళ్లను కాపాడండి అంటూ పిలుపునిచ్చారు.

 

మళ్లీ బైంసాకు వెళ్తా.. జైలుకు పంపిన తమ్ముళ్లను గుండెకు హత్తుకోవడానికి వెళ్తానని పేర్కొన్నాడు. మీ భక్తి మరియు నీ యాగాలు అంతా మీ కొడుకుని ముఖ్యమంత్రి చేయడం కోసమే అంటూ ఎద్దేవా చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ చేసిన ప్రసంగం గురించి సీనియర్ రాజకీయ నేతలు మాట్లాడుతూ...ఫస్ట్ స్పీచ్ తోనే కెసిఆర్ కి నిద్రలేకుండా చేస్తున్నాడు అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: