పెళ్లి అనేది అమ్మాయి జీవితంలో ఒక్క అన్యుహ మలుపు. కన్నవారిని కాదనుకొని, కట్టుకున్న వాడికోసం అత్తారింట్లో ఎన్నో ఆశలతో అడుగు పెడుతుంది అమ్మాయి. అలా అడుగుపెట్టిన ఆమెకు తన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసింది. భర్త మీద ప్రేమతో ఆమె ఒక్క నిండు ప్రాణాన్ని తీయడానికి కూడా వెనుకాడలేదు. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై కృష్ణమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి చిత్రహింసలకు గురి చేసింది. దింతో ఆ మహిళా ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కడప జిల్లా సిద్ధవటం మండలం వెంకటాయపల్లె గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. 

 

 

వెంకటాయపల్లె గ్రామానికి చెందిన గువ్వల ఓబయ్య నెల్లూరు పట్టణానికి చెందిన పద్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. చాలా రోజులుగా ఇద్దరూ తమ కుటుంబాలకు తెలియకుండా సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. ప్రియుడితో ఎంజాయ్ చేసేందుకు అతడి ఇంటికి వెళ్ళింది పద్మ. ఓబయ్య ఆదివారం ఉదయం ప్రియురాలితో గడిపేందుకు ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే ఓబయ్యను మరో మహిళతో చూసిన అతడి భార్య కృష్ణమ్మ గొడవకు దిగింది. పరాయి మహిళను ఏకంగా ఇంటికే తీసుకొచ్చేస్తావా? అంటూ భర్తపై దుర్భాషలాడింది. దింతో కుటుంబ సభ్యులు కూడా కృష్ణమ్మతో జత కలిసి ఓబయ్య, పద్మపై దాడికి పాల్పడ్డారు.

 

 


దింతో వారు ఓబయ్యను పక్క గదిలోకి తీసుకెళ్లి తాళ్లతో చేతులు, కాళ్లు కట్టిపడేశారు. అనంతరం కృష్ణమ్మ, కుటుంబ సభ్యులు కలసి పద్మపై దాడి చేశారు. ఆమె మెడకు కండువా బిగించి హత్య చేశారు. విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట సీఐ హనుమంత్‌నాయక్‌, సిద్దవటం ఎస్సై రమేష్‌బాబు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతురాలిని నెల్లూరు జిల్లాకు చెందిన పద్మ(30)గా పోలీసులు గుర్తించారు. అనంతరం శవపరీక్ష కోసం పద్మ మృతదేహాన్ని కడప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఆమె బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు. ఈ ఘటనపై ఓబయ్య భార్య కృష్ణమ్మ, కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: