ఒక పక్క దేశంలో కరోనా దెబ్బకి అల్లాడుతుంటే మరోపక్క చిత్తూరు జిల్లాలో కామంతో కళ్ళు మూసికొని పోతున్నారు కొందమంది ప్రబుద్దులు. ఇక విషయానికి వస్తే గుట్టుగా కొనసాగుతున్న వ్యభిచారం దందా ఒకటి వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని వి.కోట పట్టణంలో ఒక లాడ్జిలో కొద్దిరోజులుగా వ్యభిచారం జరుగుతోంది. ఆ పట్టణానికే చెందిన సురేంద్రబాబు అనే వ్యక్తి ఓ లాడ్జిని అడ్డాగా ఏర్పాటు చేసుకుని పర్వీన్ అనే అమ్మాయితో వ్యభిచారం కోనసాగిస్తున్నాడు. ఈ వ్యవహారానికి లాడ్జి మేనేజర్ నగేశ్, సిబ్బంది కూడా వారికి సహకరిస్తున్నారు. 

 

IHG


అయితే ఆదివారం నాడు రాత్రి పర్వీన్ బురఖా వేసుకుని లాడ్జికి వెళ్లడాన్ని అక్కడున్న కొందరు స్థానికులు చూసారు. ఆమె కోసం అక్కడికి కొద్దిసేపటికే సతీష్ అనే యువకుడు కూడా అక్కడికి వచ్చాడు. దీనితో ఆ వార్తని స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కాసేపటికే వారు లాడ్జికి చేరుకోని పర్వీన్, సతీశ్‌ తో పాటు వ్యభిచార నిర్వాహకుడు సురేంద్రబాబుని కూడా అక్కడినుంచి పరారయ్యారు. 

 

 

దీనితో అక్కడి పోలీసులు లాడ్జి మేనేజర్‌ ను అదుపులోకి తీసుకుని విచారించగా ఆ లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్లు అతను అంగీకరించాడు. ఇది అలాఉంటే కాసేపటికి పర్వీన్ బురఖా ధరించి ఇద్దరు యువకులతో  అక్కడ వెళ్లడాన్ని గమనించిన స్థానిక యువకులు వారిని ఆపి పోలీసులకు అప్పగించారు. ఈ సన్నీవేషంతో పోలీసులు పర్వీన్‌, విటుడు సతీశ్‌‌ తో పాటు నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన లాడ్జి ఒక  రాజకీయ నేతకు చెందినదిగా అక్కడి స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పట్టణంలో ఎవరైనా పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని పోలీసులు వారికి హెచ్చరికలు పంపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: