అక్రమసంబంధాల వల్ల సమాజానికి మూలస్తంభమైన కుటుంబ వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నమవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే హత్యలు, ఆత్మ హత్యలు పెరిగిపోతాయి. అలాగే పెళ్లి అనేది.. తమ జీవితాన్ని పంచుకునేందుకు ఒక వ్యక్తిని ఎంపిక చేసుకొని పెద్దల సమక్షంలో వారితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టే సంప్రదాయ తంతు. ఇక పెళ్లి తర్వాత ఎన్నో కలలతో వధూవరులిద్దరూ ఎంతో ఆనందంగా వైవాహిక జీవితంలోకి అడుగు పెడతారు. అయితే అలా అడుగు పెట్టిన ఓ వ్యక్తికి ఊహించిన షాక్ తగిలింది. అతనికి పెళ్లై కొద్ది నెలలు కూడా గడవడం లేదు.
ఆ తొలి రోజుల్లోనే భార్య మొబైల్కు అశ్లీల వీడియోలు, ఫొటోలు రావడాన్ని గమనించి భర్త షాక్కు గురయ్యాడు. ముందు ఎవరో బెదిరిస్తున్నారని అనుకున్నాడు.. తీరా ఆరా తీస్తే... ఆమె ప్రేమికుడేనన్న విషయం తెలిసి కంగుతిన్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు చూస్తే.. హాసన్ జిల్లాకు చెందిన ఓ మహిళ చిక్కమంగళూరు జిల్లాలోని ఓ కోర్టులో టైపిస్ట్ గా పనిచేస్తోంది. 2019 జూన్ 30న బెంగళూరు సుబ్రమణ్యనగరకు చెందిన యువకుడికి ఇచ్చి నిశ్చితార్థం చేశారు. నవంబర్ 24 వీరి వివాహం వైభవంగా జరిపించారు.
ఇక పెళ్లయిన పది రోజులు మాత్రమే భర్తతో కలిసి సుబ్రమణ్యనగరలో సదరు మహిళ ఉంది. ఆ కొద్ది రోజులపాటు వీరి సంసారం సజావుగానే సాగింది. అయితే ఇంతలోనే భార్య ఫోన్ కి ఓ వ్యక్తి నుంచి ఆమె నగ్న వీడియోలు రావడం ఆమె భర్త గమనించాడు. వెంటనే అతడు వీడియో కింత ఇచ్చిన నంబర్కు ఫోన్ చేయగా.. అటునుంచి సదరు వ్యక్తి తాము భార్యభర్తలమని మా మధ్య ఏడేళ్లు నుంచి ప్రేమ వ్యవహరం సాగినట్లు తెలిపారు. మీ నిశ్చితార్థమైన తరువాత కూడా తమిద్దరం కలిసిన ఫోటోలున్నట్లు చెప్పాడు.
ఈ క్రమంలోనే ఫోన్ మెసేజ్లు, చాటింగ్ల స్క్రీన్షాట్ చేసి పంపించాడు. దీంతో షాక్ తిన్న భర్త ఏం చేయాలో తెలియక.. వెంటనే భార్యను నిలదీశాడు. కోపగించిన ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తాను భర్త వద్దకు రానంటూ మోరాయించి కూర్చుంది. ఈ క్రమంలోనే భార్య, ఆమె ప్రియుడి చేతిలో మానసికంగా ఇబ్బంది పడిన భర్త చివరకు పోలీసులకు ఆశ్రయించాడు. ఇక బాధితుడి పిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.