ఓ తల్లి తన కొడుకును అతి కిరాతకంగా గాజుతో కోసి చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. కూతురితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది.. అసలు విషయానికొస్తే.. ఆంధ్రా యూనివర్సిటీలో పంప్ ఆపరేటర్‌గా పని చేస్తున్న ఒమ్మి పోలారావు తల్లి వరలక్ష్మి, భార్య లావణ్య, పిల్లలతో కలసి చినవాల్తేరులోని సీబీఐ డౌన్ సమీపంలో నివసిస్తున్నాడు. ఓ రోజు ఫుల్లుగా మద్యం తాగి ఇంటికొచ్చిన పోలారావు కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు.తలుపుల అద్దాలు పగలగొట్టడంతోపాటు అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై దాడికి దిగాడు. 

 

 

 

అతని కోపం ఎక్కువై ఇంట్లో ఉన్న వస్తువులను పడేస్తూ వస్తున్నాడు.. దీంతో వారు సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. ఉదయాన్నే ఇంటికి తిరిగొచ్చే సరికి పోలారావు విగతజీవిగా కనిపించాడు. ఉద్యోగం చేసుకుంటూ మరి సాఫీగా జీవనం సాగిస్తున్న అతను ఎప్పుడూ గొడవలు పడుతూ కుటుంబ సభ్యులతో కొట్లడుతుండేవాడు.. అయితే ఈ క్రమంలో రోజులాగే ఆ రోజు కూడా మద్యం తాగి ఇంటికొచ్చాడు.. దాంతో రెచ్చిపోయి అందరి మీద విరుచుకు పడ్డాడు...

 

 

రాత్రి ఫుల్లుగా మద్యం తాగొచ్చి గొడవపడి అందరినీ కొట్టాడని.. తామంతా బంధువుల ఇంటికి వెళ్లిపోయామని.. తిరిగి ఉదయాన్నే వచ్చి చూస్తే విగతజీవిగా పడి ఉన్నాడంటూ కన్నతల్లి రోధించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.. 

 

 

 

ఈ కేసు విచారణలో పోలీసులకు విస్తుపోయి నిజాలు వెలుగులోకి వచ్చాయి.. ఎంతటి దొంగ వాడైన కూడా చిన్న క్లూ వదిలేస్తాడు అని తెలిసిందే.. అదే ఇక్కడ జరిగింది.. నిత్యం మద్యం మత్తులో కుటుంబ సభ్యులను దారుణంగా కొడుతూ హింసిస్తుండడంతో విసిగిపోయినట్లు తెలిసింది. ఆ ఉద్యోగం కూడా తన తండ్రి చనిపోవడంతో కారుణ్య నియామకం కింద వచ్చిందని తేలడంతో పోలీసులకు కుటుంబ సభ్యులపై అనుమానాలు రేకెత్తాయి. అతనికి ఓ అక్క ఉందని.. తమ్ముడు అడ్డులేకపోతే ఆ ఉద్యోగం తనకే వస్తుందని భావించిన అక్క ఎవరు లేని సమయంలో ఇంటికొచ్చి తమ్ముడిని తలుపు గాజుతో అతికిరాతకంగా కోసి చంపేసింది.. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు... 

 

మరింత సమాచారం తెలుసుకోండి: