తెలంగాణాలో ఇటీవల జరిగిన పెద్ద సంఘటన అనగానే గుర్తుకొచ్చేది దిశా సంఘటన. ఇప్పుడు ఆ తరహాలోనే ఒక యువతి హత్య జరిగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తంగడపల్లి సమీపంలో చోటుచేసుకుంది. ఈ దారుణం దిశ సంఘటనను పోలి ఉంది. మంగళవారం ఉదయం 7:30 గంటల సమయంలో పోలీసులు సమాచారం అందుకున్నారు. అనంతరం సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. స్థానికులు తెలియునా వివరాల ప్రకారం.. తంగడపల్లి శివారులోని బ్రిడ్జి కింద సుమారు 25- 30 ఏళ్ల వయసున్న మహిళా మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. 

 

 

మహిళ అక్కడ వివస్త్రగా పడి విగతజీవిగా మారింది. ఇంకా యువతి ఆనవాళ్లు తెలియకుండా ఆమె మొఖాన్ని బండరాయితో కొట్టి గుర్తుపట్టరాకుండా చేశారు. దీన్ని బట్టి మొదట ఆమెపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతికి సంబంధించి ఆకుపచ్చ చీర లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ యువతి వివరాలేమి తెలియరాలేదు. అయితే.. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే చుట్టుపక్కల ఇతర పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు. ఎవరైనా యువతి మిస్సింగ్ కేసుల పట్ల అని ఆరా తీశారు.

 

 

ఇదే తరహాలో ఓ వంతెన కింద దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్లీ ఇదే తరహాలో ఘటనా జరిగింది. కాగా., సంఘటన స్థలంలో క్లూస్ టీం కొన్ని ఆధారాలను సేకరించింది. అయితే.. పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ రిపోర్టుల ఆధారంగా యువతి పై అత్యాచారం జరిగిందా..? లేదా..? అనే విషయం తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని త్వరలోనే అన్ని విషయాలు తెలుస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం కరోనా వైరస్ వార్తలు ఎక్కువగా ఉండటంతో ఈ దారుణ ఘటన ఎక్కువగా ఫోకస్ చేయబడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: