ఈ మద్య తెలంగాణ లో జిల్లా కేతేపల్లి మండలం‌ కొత్తపేట గ్రామంలొ దారుణం చొటుచేసుకొంది.  కొంత మంది ఆకతాయిలు పడుతున్న గొడవను ఆపడానికి వెళ్లిన ఓ టీఆర్ఎస్ నేత అన్యాయంగా హత్యకు గురి అయ్యాడు.  కొంత మంది ఆకతాయిలు ఓ అమ్మాయిని విషయంలో గొడవకు దిగి ప్రాణాలు తీసుదాకా వెళ్లింది.  ఆ అమ్మాయి  విషయంలో జరిగిన వారించి బుద్ది చెప్పబోయాడు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానల మారింది.. వరకు గొడవలు వద్దు అని వారించబొయిన కిరాణ షాపు యజమాని, టీఆర్‌ఎస్‌ మండల కమిటీ కార్యవర్గ సభ్యుడుఅయిన లతీఫ్ దారుణ హత్యకు గురయ్యాడు.

 

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామంలో మంగళవారం రాత్రి ఈ దారుణ ఘటన జరిగింది.  ఈ ఘర్షణలో   టీఆర్‌ఎస్‌ మండల కమిటీ కార్యవర్గ సభ్యుడు ఎస్‌కే లతీఫ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. గ్రామానికి చెందిన లతీఫ్‌ సోదరుడు జహంగీర్‌ కుమారుడు తన వాట్సాప్‌ స్టేట్‌స్ లో ఓ యువతికి భర్త్ డే సందర్భంగా విషెస్ పోస్టింగ్‌ పెట్టాడు.  అయితే తమ వర్గానికి చెందిన అమ్మాయికి వాట్సాప్ మెసేస్ పెడతావా అంటూ కొంత మంది కుర్రాళ్లు ఆగ్రహం తెచ్చుకొని జహంగీర్‌ కుమారుడిపై దాడి చేశారు.  అయితే ఈ గొడవ చూసిన లతీఫ్ తన కిరాణా షాపు ఎదురుగానే తన తమ్ముడు కొడుకుపై గొడవకు దిగడంతో కోపంతో ఊగిపోయాడు.

 

వెంటనే ఆ యువకులను అడ్డుకోబోయాడు.  అయితే అప్పటికే ఉక్రోషంతో ఉన్న ఆ యువకకులు తమకు అడ్డు చెబుతావా అంటూ లతీఫ్ పై సీరియస్ అయ్యారు.  అయితే రాత్రి గొడవలు వద్దు ఉదయం మాట్లాడుకొండి అని వారించగా కొపొద్రిక్తులైన ఆ యువకుడులు లతీఫ్ పై విచాక్షణ రహితంగా దాడీ చేసి కత్తితొ పొడవగా అక్కడికక్కడే లతీఫ్ మరణించాడు.  విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: