ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. శరవేగంగా ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందుతూ ఎంతోమందిని ప్రాణభయంతో వణికిస్తోంది. దీంతో అందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బతుకుతున్నారు. అయితే ఈ కరోనా వైరస్ ప్రభావం ఉగ్రవాదులపై కూడా పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఏ దేశం మీద పడే దాడి చేద్దామా... మనుషుల ప్రాణాలు తీద్దామా అని ఎదురుచూసే ఉగ్రవాదులు ఇప్పుడు ఎక్కడ తలదాచుకుందామ అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఉగ్రవాదులకు సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదల చేసింది ఉగ్రవాదుల సంబంధించిన కొన్ని పత్రికలు.
కరోనా వైరస్ ఎక్కువగా ఉన్నట్టు వంటి దేశాలకు పోకండి తగిన జాగ్రత్తలు పాటించండి. ఎవరు కలువకంటి మీటింగులు లాంటివి పెట్టుకోకండి. బయట ఎక్కడ పడితే అక్కడ తిరగకండి. ముఖ్యంగా వివిధ దేశాలకు వెళ్లి దాడులు చేయకండి అంటూ సూచిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే మొన్నటి వరకు తమ మతానికి సంబంధించిన రాజ్యమే ప్రపంచమంతా ఉండాలి అంటూ చెప్పి దాడులు చేయాలంటూ ప్రోత్సహించిన ఉగ్రవాద సంస్థ.. ఇప్పుడు జ్ఞానం తెచ్చుకుని ఆయా దేశాలకు పోతే కరోనా వస్తుంది అని దాడులకు పాల్పడవద్దు అంటూ సూచిస్తున్నారు.
అంతేకాదు కరోనా వైరస్ ని ప్రస్తుతం మత ప్రచారానికి కూడా వాడుకుంటున్నారు. ఎలా అంటే.. మనకు ఎలాంటి శ్రమ లేకుండా దేవుడే ఆ అజ్ఞానులను చంపేస్తున్నాడు అంటూ కరోనా వైరస్ వల్ల చనిపోతున్న వాళ్ళని దూషిస్తున్నారు ఉగ్రవాదులు. దీనిపై విశ్లేషకులు మండిపడుతున్నారు. ఉగ్రవాదులది మతతత్వం కాదని పూర్తిగా స్వార్థంతోనే ప్రపంచం మొత్తం తమ అధికారం కొనసాగించాలనే స్వార్థంతో ఇలా ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు అంటున్నారు. చివరికి కరోనా వైరస్ ని కూడా తమ మతానికి అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేసుకుంటున్నారు అని మండిపడుతున్నారు.