తెలుగు పాప్ సింగర్ స్మిత ఈమె తెలియనివారు ఎవరు ఉండరు. ప్రస్తుతం ఆమె స్టేజ్ షోలతో దుమ్ము రేపుతోంది. అయితే.. బాహుబలి సినిమా తెలియని వారు ఎవరు ఉండరు ఈమె ఈ సినిమాకు గాను ఒక పాప్ గీతాన్ని బాహుబలి సినిమాకు అంకితం ఇచ్చి సోషల్ మీడియాలో విడుదల చేసి వార్తల్లో కెక్కారు. స్మిత చంద్రబాబు నాయుడికి వీరాభిమాని. ఆయనకు అనుగుణంగా మీడియాలో పోస్ట్ పెడుతూనే ఉంటారు. ఆమె పెట్టిన వాటికి కామెంట్స్ పెడుతూనే ఉంటారు. అయితే ఆమె తాజాగా చేసిన ఒక పోస్ట్ ట్రోలింగ్ కి గురి అవుతోంది. 

 

ఆమె బాబుకి వీరాభిమాని, అలాగే ఆమె మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ టీడీపీకి అనుగుణంగా పెడుతుంది. అలాగే ఆమె ఫ్యాన్స్, టీడీపీ వాళ్ళు కూడా ఆమె ఏ పోస్ట్ పెట్టినా కూడా బాబుకి అనుగుణంగా ఉండేట్లు పోల్చుతారు. తాజాగా ఆమె ప్రముఖ రచయిత గుర్రం జాషువా రాసిన ఓ కవిత మీడియాలో పోస్ట్ చేసింది. ఆ కవిత్వంలో గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు అని ఉంది. ఈ పోస్ట్ చుసిన ప్రతి ఒక్కరు ఏపీ ముఖ్యమంత్రో గురించి అని అంటున్నారు. అలా అనుకోవడానికి గల కారం లేకపోలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎలక్షన్స్ వాయిదా వేసినందుకు కులమే కారణమని అన్నారు. సీఎం అన్నారు.

 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్నికలను వాయిదా వేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ ప్రకటించారు. అయితే ఈ నిర్ణయం పై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వానికి కనీసం సమాచారం అందించకుండా ఇలాంటి నిర్ణయాలను ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయుకుడు చంద్రబాబు నాయుడుది ఎలక్షన్ కమీషనర్ ది ఒకే కులం కాబట్టి ఇలా జరిగిందంటూ ఆరోపించారు. స్మిత పోస్ట్ పెట్టడం ఆయనకు కౌంటర్ ఇచ్చినట్లు అయిందని అంటున్నారు నెటిజన్లు.   
 

మరింత సమాచారం తెలుసుకోండి: