మనిషి ప్రాణాలంటే లెక్కలేకుండా  పోతుంది ఈరోజుల్లో. సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. రోజురోజుకు మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతుంది. మనుషుల్లో మానవత్వం కనుమరుగైపోతుంది అనడానికి ఇక్కడ జరిగిన ఘటనే నిదర్శనం. 17 ఏళ్ల దళిత బాలుడు సహా అతని తల్లిదండ్రుల పై కొంతమంది వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి విచక్షణ రహితంగా దాడి చేసారు. ఈ క్రమంలోనే సదరు మైనర్ బాలున్ని  చంపేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. సదరు 17 ఏళ్ల బాలుడి అన్న ఓ మహిళతో కలిసి ప్రేమ పేరుతో లేచి పోవడం తో ఆగ్రహించిన మహిళ కుటుంబీకులు తమ్ముడి పై ఈ దారుణానికి ఒడిగట్టారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ వైజాపూర్ తాహిసిల్ లో గల లక్డా  ఖండాల గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దళిత బాలున్ని  అతి దారుణంగా హత్య చేయడంతో దళిత కార్యకర్తలు న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.

 

 

 ఇక ఈ విషయం రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వరకు వెళ్లగా ఆయన ఈ ఘటనపై స్పందించారు. సదరు మైనర్ బాలుడు హత్యకు సంబంధించి సమగ్ర విచారణ జరిపి 30 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయాలంటూ అక్కడి స్థానిక పోలీసులను ఆదేశించారు. బాలా సాహెబ్, అల్కాల ఇద్దరు కొడుకులు. ఇందులో పెద్ద కొడుకు... దేవ్ కర్ అనే వ్యక్తి  20 ఏళ్ల కూతుర్ని  ప్రేమించి ఆ యువతితో మార్చి 12వ తేదీన పరారైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన బాలిక తండ్రి దేవ కర్ అతని తమ్ముడు రోహిదాస్... ప్రేమ జంట లేచిపోయిన తర్వాత  అతని  కుటుంబాన్ని హెచ్చరించారు. ఇక వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోలేదు. ఇక ఆ తర్వాత తీవ్ర ఆగ్రహానికి గురైన సదరు యువతి తండ్రి బాబాయ్ అతని  కుటుంబసభ్యులపై దారుణంగా దాడికి పాల్పడ్డారు.

 

 

 ఈ క్రమంలోనే భీమ్ రాజ్  గైక్వాడ్ అనే బాలుడిని దారుణంగా పదునైన వస్తువులతో దాడి చేసి హత్య చేశారు. ఆ తర్వాత అతని తల్లిదండ్రులు బాలా సాహెబ్ ఆల్కేలా లపై  కూడా దాడి చేశారు. ఇక ఈ ఘటనలో హోమ్ మినిస్టర్ సైతం స్పందించడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు  నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు సరిగా స్పందించకపోవడం వల్లే ఈ హత్య జరిగినట్లు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: