ప్రస్తుతం భూమి మీద ఉన్న ప్రపంచ దేశాలు మరియు అదే విధంగా అన్ని ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కరోనా వైరస్ గురించి తెగ భయపడిపోతున్నారు. ఈ వైరస్ ని అరికట్టడానికి చాలా మంది రాజకీయ నాయకులు మరియు శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ ఎటువంటి జాగ్రత్తలు మరియు ఏ విధంగా కరోనా వైరస్ వస్తే వ్యవహరించాలో ఇటువంటి విషయాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ముందుకు సాగుతున్నారు. ఇటువంటి తరుణంలో కరోనా వైరస్ కంటే ఎక్కువగా శ్రీరెడ్డి కామెంట్లు సోషల్ మీడియాలో భయపెడుతున్నాయి. విషయంలోకి వెళితే మనదేశంలో ఈ వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతూ వస్తోంది.

 

ఎన్ని జాగ్రత్తలు మరియు నివారణ చేపట్టిన గాని అడ్డుకట్ట వేయలేకపోతున్నారు కేంద్ర వైద్య నిపుణులు. దాదాపు నూట యాభై దగ్గర్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు లెక్కలు వస్తున్నాయి. దీనిలో విదేశీయులు 17 ఉన్నట్లు తెలుస్తోంది.  ఇలా కరోనా ఇంతలా తన ప్రభావాన్ని చూపుతుంటే.. దానిపైనే కొంతమంది మీమ్స్, ట్రోల్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇటువంటి టైములో శ్రీ రెడ్డి సైతం కరోనా బారిన పడేవారికి ఓ కౌంటర్ వేసింది.

 

నిత్యం ఏదో ఒక వివాదంపై స్పందించడం, వార్తల్లో నిలవడం శ్రీ రెడ్డికి అలవాటే. హాట్ హాట్ ఫోజులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు పిచ్చెక్కిస్తూ ఉంటుంది. పద్దతిగా చీర కట్టుకుని గుడికి వెళ్లిన శ్రీ రెడ్డి ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ చేసింది. గుడికి వెళ్లిన శ్రీ రెడ్డి.. ‘దేవాలయంలో పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం ఆశీర్వాదం.. కరోనా పాజిటివ్ అని తేలడం కర్మ.. జాగ్రత్త’ అంటూ పోస్ట్ చేసింది. ఇటీవల తమిళ సినిమా రంగంలో డైరెక్టర్ల గొడవల విషయంలో తన మద్దతు ఎప్పుడు డైరెక్టర్లకు ఉంటుంది అంటూ హీరో విశాల్ ని టార్గెట్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: