ఈ మద్య దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా అమ్మాయిలు, ఆంటీలు చివరికి చిన్నపిల్లు, వృద్దులను కూడా చూడకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు.  అత్యాచారం చేయడం తమ గుట్టు బయట పడుతుందని హత్యలు చేయడం కామన్ అయ్యింది.  చట్టాలు ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నా కొంత మంది దుర్మార్గులు రెచ్చిపోతూనే ఉన్నారు. టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్ది అభివృద్ది జరగాల్సింది పోయి.. అనర్ధాలు ఎక్కువ జరుగుతున్నాయి.  ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి కామాంధులు మరీ రెచ్చిపోతున్నారు. తాము చేస్తున్న దారుణాలు వీడియోలు తీయడం.. టిక్ టాక్ చేయడం లాంటివి చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

 

తాజాగా హైదరాబాద్‌లోని కామటిపురా పోలీస్‌ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది.. మాయమాటలు చెప్పి ఇద్దరు బాలికలను లొంగిదీసుకున్న ఐదుగురు యువకులు... ఆ తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తూ.. ఆ ఇద్దరు మైనర్ బాలికలపై పైశాచికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఇద్దరు మేజర్లు కాగా.. మరో ముగ్గురు మైనర్లు.  వీరు కొంత కాలంగా ఆవారాగా తిరుగుతూ.. సెల్ ఫోల్లో అశ్లీల వీడియోలు చూస్తు రెచ్చిపోతున్నట్టు కొంత మంది ఆరోపిస్తున్నారు.  కాగా, తమపై జరిగిన సామూహిక అత్యాచారం గురించి కుటుంబసభ్యులకు చెప్పుకొని వాపోవడంతో... కామటిపురా పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు.. దీంతో, కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

 

ఇటీవల హైదరాబాద్ లో మైనర్లపై కొంత మంది కామాంధులు రెచ్చిపోతున్నారని.. మరి దారుణమైన విషయం ఏంటంటే చిన్న పిల్లలు అని కూడా చూడకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారని పోలీసలు తెలుపుతున్నారు.  మన చుట్టు పక్కల జరుగుతున్న అన్యాయాలను వెలుగు లోకి తీసుకు రావాలని.. పోలీసులు ఎప్పుడూ అలర్ట్ గా ఉంటారని.. ఇప్పటికే హైదరాబాద్ లో షీ టీమ్ మహిళల రక్షణగా ఉంటుందని పోలీసులు అంటున్నారు. తాజాగా మైనర్లపై అత్యాచారం చేసిన నింధితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: